Switch to English

అసలు సిసలు వెన్నుపోటు.. అప్పుడూ.. ఇప్పుడూ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోవడానికి కారణమెవరు.? మొట్టమొదటిగా విభజనకు అనుకూల నిర్ణయం తీసుకున్నది తెలుగుదేశం పార్టీ. తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంలో ‘మేమే తెలంగాణకు అనుకూలంగా మొట్టమొదట లేఖ ఇచ్చాం..’ అని చంద్రబాబు చెప్పుకున్నారు. కాంగ్రెస్‌ హయాంలో విభజన జరిగిందన్నది నిర్వివాదాంశం. ఆ విభజనకు బీజేపీ సహకరించిందన్నదాంటోనూ ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అలా, రాష్ట్ర విభజన విషయంలో రెండు నాల్కల ధోరణి ప్రదర్శించిన టీడీపీ, 2014 ఎన్నికల్లో, తెలంగాణలో దెబ్బతినేసినా.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది.

ఇప్పుడు అమరావతికి వెన్నుపోటు పొడిచింది తెలుగుదేశం పార్టీ. ఐదేళ్ళు సరిపోలేదు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి, అమరావతిని నిర్మించడానికంటే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? ఇక, ఇప్పుడు మూడు రాజధానుల ఎపిసోడ్‌ తెరపైకొచ్చింది. ‘మేం అమరావతికి కట్టుబడి వున్నాం..’ అని ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. కానీ, ఇప్పుడేం జరిగింది.? అమరావతి నుంచి ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌నీ, జ్యుడీషియల్‌ క్యాపిటల్‌నీ తరలిస్తున్నారు. అమరావతి ఇకపై కేవలం శాసన రాజధాని మాత్రమే. అంటే, అక్కడ అసెంబ్లీ మాత్రమే వుంటుంది. అసెంబ్లీ అంటే, ఏడాదికి ఓ మూడు సార్లు.. అది కూడా ఇటీవలి కాలంలో ‘నామ్ కే వాస్తే’ అన్నట్టు తయారైంది. ఆ లెక్కన, సమీప భవిష్యత్తులో అమరావతి ఉనికి అనేది వుండకపోవచ్చు.

అసలు సిసలు వెన్నుపోటు అంటే ఇదే మరి.! ప్రత్యేక హోదా నినాదాన్ని అటు టీడీపీ, ఇటు వైసీపీ గాలి కొదిలేశాయి.. ఈ రెండూ ’60-40’ ఒప్పందాలతో అధికారం పంచుకుంటున్నాయన్న విమర్శలు లేకపోలేదు. ప్రత్యేక హోదా గురించి టీడీపీ అధికారంలో వున్నప్పుడు మాట్లాడలేదు.. వైసీపీ కూడా అధికారంలోకి వచ్చాక మాట్లాడటంలేదు. అధికారం లేనప్పుడు మాత్రం ఈ రెండు పార్టీలకీ ప్రత్యేక హోదా అవసరమైంది. ఇదొక్కటి చాలు.. టీడీపీ, వైసీపీ.. ఏ స్థాయిలో ‘వెన్నుపోటు’ రాజకీయాలు నడుపుతున్నాయో చెప్పడానికి. ఇదే, ఆంధ్రప్రదేశ్‌కి.. ఈ ‘వెన్నుపోటు రాజకీయమే’ పెను శాపంగా మారింది. ఐదేళ్ళలో ఒక్క రాజధానినే నిర్మించుకోలేకపోయిన ఆంధ్రప్రదేశ్‌, సమీప భవిష్యత్తులో మూడు రాజధానుల్ని నిర్మించుకునే పరిస్థితి వుంటుందా.? జనాన్ని మభ్యపెట్టడానికి కాకపోతే, ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్‌లో ‘విజ్ఞత’ కాస్తంతైనా కన్పిస్తుందా.!

తాము ఏం చెప్పినా, జనం నమ్మి ఓట్లు వేస్తారనే నమ్మకం ఆయా పార్టీల్లో వున్నంత కాలం.. ఆ నమ్మకాలు నిజమవుతున్నంత కాలం.. ఆంధ్రప్రదేశ్‌ మళ్ళీ మళ్ళీ వెన్నుపోటుకి గురవుతూనే వుంటుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...