Switch to English

ఎట్టకేలకు వెనక్కి తగ్గిన చైనా

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

సరిహద్దుల్లో గత కొన్ని వారాలుగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టినట్టుగా తెలుస్తోంది. ఇటీవల భారత్, చైనా జవాన్ల మధ్య ఘర్షణ జరిగిన గల్వాన్ లోయ నుంచి వెనక్కి వెళ్లడానికి చైనా అంగీకరించింది. ఈ మేరకు ఇరు దేశాల సైన్యం వివాదాస్పద ప్రాంతం నుంచి వెనక్కి వెళుతున్నాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. తూర్పు లద్దాఖ్ లోని గల్వాన్ లోయ నుంచి రెండు దేశాల సైనికులు సోమవారం కనీసం కిలోమీటర్ మేర వెనక్కి వెళ్లాయని తెలిపాయి. చైనా సైన్యం లోయలో ఏర్పాటు చేసిన తత్వాలిక టెంట్లను తొలగించి వెనక్కి వెళుతోందని పేర్కొన్నాయి. ఈ మేరకు ప్రాథమికంగా చేసిన పరిశీలనలో ధ్రువీకరణ అయిందని చెప్పాయి.

అయితే, నిజంగానే వారు వెనక్కి వెళుతున్నారా లేక ఏదైనా వ్యూహం ఉందా అనేది నిర్ధారించుకోవాల్సి ఉందని వివరించాయి. జూన్ 15 అర్ధరాత్రి గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. లోయలో చైనా సైనికులు వేసిన టెంటును తొలగించేందుకు వెళ్లిన భారత సైనికులను చైనా సైనికులు దొంగ దెబ్బతీశారు. ముళ్ల కంచె చుట్టిన రాడ్లు, మేకులు కొట్టని రాడ్లతో మనవాళ్లపై తెగబడటంతో 20 మంది భారత వీరులు అమరులయ్యారు. అదే సమయంలో అంతకు రెట్టింపు స్థాయిలో చైనావాళ్లను చీలిచెండాడారు. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

సరిహద్దుల్లో పోటాపోటీగా సైన్యాన్ని, ఆయుధ సంపత్తిని మోహరించాయి. మరోవైపు ఇరు దేశాల మధ్య కమాండర్ల స్థాయిలో మూడు దఫాలపాటు చర్చలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా జూన్ 22న జరిగిన చర్చల్లో గల్వాన్ లోయ నుంచి రెండు దేశాల సైనికులు కనీసం రెండు నుంచి మూడు కిలోమీటర్లు వెనక్కి వెళ్లాలని నిర్ణయానికి వచ్చాయి. కానీ నోటితో ఒకటి చెప్పి, నొసటితో మరొకటి చేసే చైనా.. ఆ మేరకు వెనక్కి వెళ్లలేదు. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అలాగే కొనసాగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం లద్దాఖ్ లో పర్యటించి చైనా పేరెత్తకుండా ఆ దేశానికి గట్టి వార్నింగ్ ఇవ్వడం.. డ్రాగన్ వైఖరిపై అమెరికా నేరుగా ధ్వజమెత్తడం వంటి పరిణామాల నేపథ్యంలో సోమవారం చైనా సైన్యం వెనక్కి మళ్లింది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...