‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ అంటూ కర్నూలు జిల్లాకి చెందిన ఓ బాలిక విషయమై జనసేన పార్టీ జరిపిన పోరు బాధిత కుటుంబానికి కొంత భరోసానిచ్చింది. రాజకీయ పెద్దల పైత్యం వికటించి.. బాధితురాలి కుటుంబం కోరిక మేరకు ఆ కేసుని సీబీఐకి ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చిన విషయం విదితమే. టీడీపీ హయాంలో సుగాలి ప్రీతి హత్య జరిగింది. ఆమె విద్యనభ్యసిస్తున్న విద్యా సంస్థలోనే ఆమెపై హతమార్చిన దుండగులు, ఆత్మహత్యగా చిత్రీకరించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది.
తాజాగా, తెలంగాణలోని కొత్తగూడెంకి చెందిన బాలిక దేవిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, తమ కుమార్తెపై అత్యాచారానికి ఒడిగట్టి, ఆమెను చంపేశారంటూ బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. జరిగిన ఘోరాన్ని జనసైనికులు సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నారు. ‘జస్టిస్ ఫర్ దేవిక’ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో హోరెత్తించేస్తున్నారు.
కాగా, ఈ ఘటనపై ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు స్పందించారు. దేవిక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. రాత్రి ఇంట్లో నిద్రపోయిన బాలిక, ఆ తర్వాత కన్పించకుండా పోయిందనీ, చివరికి రైలు పట్టాలపై శవమై తేలిందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మృతదేహం అర్థనగ్న స్థితిలో వుండడంతో ఆమెపై అఘాయిత్యం జరిగిందనీ, ఆ తర్వాత ఆమెను చంపేసి రైలు పట్టాలపై పడేసి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోపక్క, ఈ ఘటనపై దేవిక తల్లిదండ్రులు సందీప్ అనే యువకుడిపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఘటన జరిగినప్పటినుంచి సందీప్, అతని కుటుంబ సభ్యులు పరారీలో వున్నట్లు తెలుస్తోంది. సందీప్ ఓ సారి అర్థరాత్రిపూట గోడ దూకి తమ ఇంట్లోకి వచ్చాడనీ, అతన్ని పట్టుకుని నిలదీశామనీ, అతని తల్లిదండ్రులకి అప్పగించామని దేవిక తల్లిదండ్రులు చెబుతున్నారు. మొత్తమ్మీద, జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించి హ్యాష్ట్యాగ్ని ట్రెండింగ్ చేయడంతో.. ఈ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
380238 918108I dont typically comment but I gotta say thankyou for the post on this wonderful 1 : D. 855289