సినీ సెలబ్రిటీలు పబ్లిక్ లోకి వచ్చారంటే అతి అటెన్షన్ వల్ల ఇబ్బంది పడకతప్పదు. అదే హీరోయిన్ ఐతే ఈ ఇబ్బంది మరింత ఎక్కువగా ఉంటుంది. ఆ హీరోయిన్ ను ఒక పబ్లిక్ ప్రాపర్టీలాగా చూస్తారు కొంత మంది బడుద్ధాయిలు. జనాలు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆమెను ఇబ్బంది పెట్టి తప్పించేసుకోవచ్చు అంటారు. అలాంటి ఇబ్బందే రెజినాకు ఎదురైంది.
కొన్ని సంవత్సరాల క్రితం చెన్నైలో ఒక సినిమా ప్రమోషన్ కోసం థియేటర్ వద్దకు రెజినా వెళితే ఆమెను టార్గెట్ చేస్తూ కొంత మంది ఆకతాయిలు కామెంట్స్ విసిరారట. ఒకడు అయితే తనను తాకాలని ప్రయత్నించాడని అయితే తనకు తగిన బుద్ది చెప్పానని రెజీనా రివీల్ చేసింది. హీరోయిన్లు బయటకు వచ్చినప్పుడు ఈ రకమైన సంఘటనలు వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని అంటోంది రెజీనా.
ఈమె చివరిగా తెలుగులో ఎవరు చిత్రం ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ఇప్పటివరకూ మరో సినిమా సైన్ చేయలేదు. తెలుగులో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేద్దామని నిర్ణయించుకున్న రెజీనా, తమిళంలో మాత్రం ఏకంగా నాలుగు చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది.
679062 335541hello, i came in to learn about this subject, thanks alot. will put this website into my bookmarks. 783717
945692 938809Glad to be one of a lot of visitants on this awesome internet site : D. 911214