కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఏరియాలో రోడ్లపై చిరుత సంచరించిన విషయం అందరికీ తెలిసిందే.. అప్పట్లో ప్రజలపై దాడి చేసిన ఆ చిరుత మాయమై, రెండు వారాల క్రితం రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో చిరుత పులి జాడ అటవీ ప్రాంతంలో కనిపించింది. హమ్మయ్యా అనుకున్న రాజేంద్ర నగర్ ప్రజల్లో మళ్ళీ చిరుత భయాన్ని నింపింది. గత రాత్రి హైదరాబాద్ శివారు ప్రాంతం రాజేంద్రనగర్లో మరోసారి చిరుత సంచరించి ఆ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
రాజేంద్రనగర్ సమీపంలోని వ్యవసాయ యూనివర్శిటీ పరిసరాల్లో విహరించిన చిరుత సంచరించగా.. ఆ తర్వాత అటు నుంచి జన నివాసం ఉన్న ప్రాంతంలోని ఓ ఇంటి కాంపౌండ్లోకి వెళ్లి కిటీకీలో నుంచి ఇంటిని పరిశీలించిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఇది చూసిన ప్రజలు మరింత భయాందోళనకు లోనయ్యారు. కాసేపటికి చిరుత తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు. అధికారులు దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.
282624 809489There is clearly a lot to know about this. I think you produced various great points in features also. 861802