ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధాని అయ్యారు.. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించాక.. తన ఖ్యాతిని మరింతగా పెంచుకున్నారు ప్రధాని మోడీ. అలా ‘మోడీ 2.0’ పాలనకి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది పాలనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో అతి ముఖ్యమైనది జమ్మూకాశ్మీర్ని రెండుగా విభజించడం. ఉమ్మడి జమ్మూకాశ్మీర్కి అప్పటిదాకా వున్న ప్రత్యేక హోదాని కేంద్రం రద్దు చేసింది. ప్రత్యేక రాష్ట్ర హోదా కోల్పోవడమే కాదు, ఇప్పుడది అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత రాష్ట్రంగా మారింది. ఒకప్పటి ఉమ్మడి జమ్మూకాశ్మీర్ నుంచి లఢక్ ప్రాంతం వేరు పడి, అదొక అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతమయ్యింది. జమ్మూకాశ్మీర్తో పోల్చితే లడక్లో తీవ్రవాద ప్రభావం తక్కువే. పైగా, ప్రత్యేక లడక్ సాధన కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ – లడక్ విభజన తర్వాత.. లడక్లో పెద్దగా తీవ్రవాద ప్రేరేపిత ఘటనలు చోటు చేసుకోలేదు. ఆ మాటకొస్తే, జమ్మూకాశ్మీర్లోనూ తీవ్రవాదంతో ముడిపడిన సంఘటనలు గణనీయంగా తగ్గాయి. భద్రతాదళాలపై పౌరులు రాళ్ళు రువ్వడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో చోటు చేసుకోకపోవడం గమనార్హం. దశాబ్దాలుగా అదొక పరిష్కారం లేని సమస్య.. అదొక రావణ కాష్టం.. అనే భావన నుంచి ఇప్పుడు యావత్ భారతవని జమ్మూకాశ్మీర్ని ప్రత్యేకంగా చూసే పరిస్థితి వచ్చిందంటే దాన్ని మోడీ ఘనతగానే చెప్పుకోవచ్చు.
ఇక, వైఫల్యాల విషయానికొస్తే చాలానే వున్నాయి. రాష్ట్రాల నుంచి అధికారాల్ని లాక్కోవడంలో కేంద్రం ఓ క్రమ పద్ధతిలో ముందుకు పోతోంది. ఆయా రాష్ట్రాల్లో తమకు రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తోన్న రాజకీయ పార్టీలపై బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నది నిర్వివాదాంశం. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ గందరగోళం సృష్టించి, ప్రభుత్వాలు కూలిపోయేలా చూడటం.. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి, ఆయా రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడం.. ఇవన్నీ ఓ పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి. కేంద్రంలో తమకున్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ పాల్పడుతున్న రాజకీయ కుట్రలు అన్నీ ఇన్నీ కావు.
ఇక, కరోనా వైరస్ నేపథ్యంలో.. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినా.. అది సామాన్యుడికి అస్సలేమాత్రం ఉపయోగపడేలా లేదు. పైగా, కరోనా విషయంలో కేంద్రం ముందుగా మేల్కొనలేకపోయిందన్న విమర్శలున్నాయి. ‘అంతర్జాతీయ విమానాల్ని తక్షణం నిలిపివేయాలి..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే కేంద్రాన్ని అప్రమత్తం చేసినా కేంద్రం, ఆలస్యంగా స్పందించింది. ఆ కారణంగా దేశంలోకి పెద్దయెత్తున కరోనా కేసులు దిగుమతి అయిపోయాయి. నిజాముద్దీన్ మర్కజ్ విషయంలో కేంద్ర – రాష్ట్ర (ఢిల్లీ) ప్రభుత్వాల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సుస్పష్టం. చెప్పే లెక్కలకీ, చేతల్లో పనులకీ అస్సలేమాత్రం పొంతన వుండదన్న విమర్శ మోడీ సర్కార్పై మొదటి నుంచీ (2014 నుంచీ) వుంది. అదిప్పుడు కూడా కొనసాగుతూనే వుంది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ విషయమై కేంద్రం రాష్ట్రాలకు విధించిన షరతులు.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని చెప్పకనే చెబుతోంది. మొత్తమ్మీద.. పాలనలో మంచి పనులే కాదు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిన పనులూ గత ఏడాదిగా మోడీ నాయకత్వంలో జరుగుతున్నాయన్నమాట.
402898 411756I like the valuable information you give in your articles. Ill bookmark your weblog and check once more here regularly. Im quite certain Ill learn several new stuff proper here! Good luck for the next! 636852
293591 632482An fascinating discussion may possibly be worth comment. I think you need to write on this subject, it may surely be a taboo topic but typically people are not enough to dicuss on such topics. To a higher. Cheers 726465