Switch to English

మోడీ 2.0 పాలనకి ఏడాది: విజయాలే కాదు, వైఫల్యాలు కూడా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధాని అయ్యారు.. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించాక.. తన ఖ్యాతిని మరింతగా పెంచుకున్నారు ప్రధాని మోడీ. అలా ‘మోడీ 2.0’ పాలనకి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ ఏడాది పాలనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుంది. అందులో అతి ముఖ్యమైనది జమ్మూకాశ్మీర్‌ని రెండుగా విభజించడం. ఉమ్మడి జమ్మూకాశ్మీర్‌కి అప్పటిదాకా వున్న ప్రత్యేక హోదాని కేంద్రం రద్దు చేసింది. ప్రత్యేక రాష్ట్ర హోదా కోల్పోవడమే కాదు, ఇప్పుడది అసెంబ్లీతో కూడిన కేంద్ర పాలిత రాష్ట్రంగా మారింది. ఒకప్పటి ఉమ్మడి జమ్మూకాశ్మీర్‌ నుంచి లఢక్‌ ప్రాంతం వేరు పడి, అదొక అసెంబ్లీ లేని కేంద్ర పాలిత ప్రాంతమయ్యింది. జమ్మూకాశ్మీర్‌తో పోల్చితే లడక్‌లో తీవ్రవాద ప్రభావం తక్కువే. పైగా, ప్రత్యేక లడక్‌ సాధన కోసం ఎన్నో ఏళ్ళుగా పోరాటాలు జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్‌ – లడక్‌ విభజన తర్వాత.. లడక్‌లో పెద్దగా తీవ్రవాద ప్రేరేపిత ఘటనలు చోటు చేసుకోలేదు. ఆ మాటకొస్తే, జమ్మూకాశ్మీర్‌లోనూ తీవ్రవాదంతో ముడిపడిన సంఘటనలు గణనీయంగా తగ్గాయి. భద్రతాదళాలపై పౌరులు రాళ్ళు రువ్వడం వంటి ఘటనలు ఇటీవలి కాలంలో చోటు చేసుకోకపోవడం గమనార్హం. దశాబ్దాలుగా అదొక పరిష్కారం లేని సమస్య.. అదొక రావణ కాష్టం.. అనే భావన నుంచి ఇప్పుడు యావత్‌ భారతవని జమ్మూకాశ్మీర్‌ని ప్రత్యేకంగా చూసే పరిస్థితి వచ్చిందంటే దాన్ని మోడీ ఘనతగానే చెప్పుకోవచ్చు.

ఇక, వైఫల్యాల విషయానికొస్తే చాలానే వున్నాయి. రాష్ట్రాల నుంచి అధికారాల్ని లాక్కోవడంలో కేంద్రం ఓ క్రమ పద్ధతిలో ముందుకు పోతోంది. ఆయా రాష్ట్రాల్లో తమకు రాజకీయ ప్రత్యర్థులుగా భావిస్తోన్న రాజకీయ పార్టీలపై బీజేపీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నది నిర్వివాదాంశం. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ గందరగోళం సృష్టించి, ప్రభుత్వాలు కూలిపోయేలా చూడటం.. పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించి, ఆయా రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడం.. ఇవన్నీ ఓ పద్ధతి ప్రకారమే జరుగుతున్నాయి. కేంద్రంలో తమకున్న అధికారాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ పాల్పడుతున్న రాజకీయ కుట్రలు అన్నీ ఇన్నీ కావు.

ఇక, కరోనా వైరస్‌ నేపథ్యంలో.. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించినా.. అది సామాన్యుడికి అస్సలేమాత్రం ఉపయోగపడేలా లేదు. పైగా, కరోనా విషయంలో కేంద్రం ముందుగా మేల్కొనలేకపోయిందన్న విమర్శలున్నాయి. ‘అంతర్జాతీయ విమానాల్ని తక్షణం నిలిపివేయాలి..’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుగానే కేంద్రాన్ని అప్రమత్తం చేసినా కేంద్రం, ఆలస్యంగా స్పందించింది. ఆ కారణంగా దేశంలోకి పెద్దయెత్తున కరోనా కేసులు దిగుమతి అయిపోయాయి. నిజాముద్దీన్‌ మర్కజ్‌ విషయంలో కేంద్ర – రాష్ట్ర (ఢిల్లీ) ప్రభుత్వాల మధ్య కమ్యూనికేషన్‌ గ్యాప్‌ సుస్పష్టం. చెప్పే లెక్కలకీ, చేతల్లో పనులకీ అస్సలేమాత్రం పొంతన వుండదన్న విమర్శ మోడీ సర్కార్‌పై మొదటి నుంచీ (2014 నుంచీ) వుంది. అదిప్పుడు కూడా కొనసాగుతూనే వుంది. 20 లక్షల కోట్ల ప్యాకేజీ విషయమై కేంద్రం రాష్ట్రాలకు విధించిన షరతులు.. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనాన్ని చెప్పకనే చెబుతోంది. మొత్తమ్మీద.. పాలనలో మంచి పనులే కాదు.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిన పనులూ గత ఏడాదిగా మోడీ నాయకత్వంలో జరుగుతున్నాయన్నమాట.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

రాజకీయం

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎక్కువ చదివినవి

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’ కార్యక్రమానికి హాజరై.. తాను వేసుకున్న గౌను...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...