మెగా హీరో రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇదే సమయంలో చిరంజీవి ఆచార్య చిత్రంలోనూ ఒక కీలకమైన గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న మరో హీరో ఎన్టీఆర్ ఇప్పటికే త్రివిక్రమ్తో తన తదుపరి చిత్రాన్ని ఖరారు చేసుకున్నాడు. ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తి చేసిన వెంటనే త్రివిక్రమ్ మూవీని పట్టాలెక్కించి వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్లో విడుదల చేయాలనుకుంటున్నాడు.
ఎన్టీఆర్ ఇంత ప్లాన్డ్గా ఉంటే చరణ్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటున్నాడు అంటూ మెగా ఫ్యాన్స్ స్వయంగా విమర్శలు గుప్పిస్తున్నారు. గత కొన్నాళ్లుగా చరణ్ తదుపరి చిత్రం విషయంలో పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఎంతో మంది దర్శకులు చరణ్కు కథలు వినిపించినట్లుగా వార్తలు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. సందీప్ రెడ్డి, సురేందర్ రెడ్డి, సుజీత్, వంశీ పైడిపల్లి, కొరటాల ఇంకా పలువురు దర్శకులు కూడా ఈయనతో వర్క్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.
చరణ్ గురించి ఇన్ని వర్గాలు పుకార్లు వస్తున్నా కూడా ఇప్పటి వరకు ఫ్యాన్స్కు క్లారిటీ ఇవ్వడం లేదు. ఫ్యాన్స్ ఈ విషయమై జట్టు పీక్కుంటున్నారు. కనీసం ప్రస్తుతానికి ఏ సినిమా చేసే ఆలోచన లేదు.. ఆర్ఆర్ఆర్ పూర్తి అయిన తర్వాత కొత్త సినిమాను మొదలు పెడతాను. ప్రస్తుతానికి కథలు కూడా వినలేదు అని చెప్పొచ్చు కదా అంటున్నారు. మెగా ఫ్యాన్స్ చరణ్ గురించి వస్తున్న వార్తలతో విసిగి పోయారు. వారికి ఇప్పటికైనా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
721285 726578Thank you for your very great information and feedback from you. san jose used car 119942
246612 803826Constructive criticism is generally looked upon as becoming politically incorrect. 923114