నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి.. చాలామంది ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ, ఇప్పుడు వాటి గురించిన చర్చ చాలా తక్కువగా జరుగుతోంది. ఎందుకంటే, రోడ్లపై వాహనాల రద్దీ కన్పించడంలేదు. కొన్ని వాహనాలకు మాత్రమే రోడ్లపై తిరిగేందుకు అనుమతి వుంది. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. దాంతో, రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువగానే కన్పిస్తున్నాయి.
తాజాగా హైద్రాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు మీద ఓ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోపక్క, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి వంతెన మీద, పోలీసులు అడ్డుగా పెట్టిన ఓ తాడు, ఓ వ్యక్తి ప్రాణాల్ని బలిగొంది. ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి విధి నిర్వహణలో భాగంగా వెళుతూ, చీకట్లో తాడు కన్పించక ప్రమాదానికి గురయ్యాడు.
ఇదిలా వుంటే, కరోనా సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సదరు వ్యక్తిని, గ్రామస్తులు కరోనా అనుమానితుడిగా భావించడంతోనే ఇదంతా జరిగిందట. ఇలాంటి వార్తలు మీడియాలో ‘బ్రేకింగ్..’ అంటూ ప్రచారం జరిగే సరికి, లేనిపోని భయాందోళనలు జనంలో పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ ఎంత ప్రమాదకారి.. అనేది నమోదవుతున్న కేసులు, మరణాల్ని బట్టి తెలుస్తోంది.
అదృష్టవశాత్తూ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటిదాకా కరోనా మరణాల్లేవు. దేశంలో ఈ మరణాల సంఖ్య 19కి చేరుకుందనుకోండి.. అది వేరే సంగతి. కరోనా వైరస్ చాలా ప్రత్యేకమైనది. ఇది అత్యంత వేగంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతుంది కాబట్టి, లాక్ డౌన్ పూర్తిగా మన క్షేమం కోసమేనని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఏదో వాహనం దొరికింది కదా అని దొంగచాటుగా ప్రయాణాలు చేస్తే, ప్రమాదాల్ని కొనితెచ్చుకోవాల్సిందే. అదే సమయంలో, కరోనా అనుమానంతో.. ‘వెలివేయడం’ అనేది కూడా జుగుప్సాకరమైన, హేయమైన చర్య.
94845 80949I believe other website proprietors should take this website as an model, really clean and excellent user friendly style and style, as well as the content material. Youre an expert in this topic! 791900
469451 644380i could only wish that solar panels cost only several hundred dollars, i would adore to fill my roof with solar panels- 783780
580197 704839This web page may be a walk-through like the data you wanted concerning this and didnt know who want to. Glimpse here, and you will undoubtedly discover it. 925071