Switch to English

ఉరి.. ఎన్ కౌంటర్: ఏది బెటర్?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

దిశ హత్య కేసులో నలుగురు నిందితులు ఎనిమిది రోజుల్లోనే ఎన్ కౌంటర్లో హతమయ్యారు. కానీ నిర్భయ హత్య కేసులో దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత దోషులకు ఉరి పడింది. అది కూడా ఎన్నో నాటకీయ పరిణామాలు, డ్రామాల నడమ. ఉరి తీయడానికి రెండు గంటల ముందు వరకు కూడా కోర్టులో వాదనలు జరిగాయి. ఏపీ సింగ్ వంటి వివాదాస్పద లాయర్ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను అడ్డుపెట్టుకుని ఆడిన ఈ ఆట ఏకంగా ఇంతకాలం కొనసాగింది. ఒకదాని తర్వాత మరొకటి, అది విఫలమైతే ఇంకోటి.. ఇలా లెక్కకు మిక్కిలిగా ఒక్కో ఎత్తు వేస్తూ.. రకరకాల పిటిషన్లతో కింది స్థాయి నుంచి సుప్రీంకోర్టు వరకు వెళుతూ న్యాయవ్యవస్థతో ఆడుకున్నారు.

అసలు నిర్భయ హంతకులకు ఉరి పడుతుందా లేదా అనే అసహనం జనాల్లో వచ్చేసింది. తన క్లైంట్లను రక్షించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో, ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్నీ ఏపీ సింగ్ చేశారు. వృత్తిపరంగా ఆయన్ను ఎవరూ తప్పుబట్టలేరు. ఒకవిధంగా మన న్యాయ వ్యవస్థలో ఎన్ని లోపాలున్నాయో ఈ కేసులో దేశానికి అర్థమైంది. వీటిని సరిదిద్దుకోవాల్సిన అవసరాన్ని ఏపీ సింగ్ కల్పించారు.

ఈ నేపథ్యంలో మరోసారి ఉరి, ఎన్ కౌంటర్లలో ఏది బెటరనే చర్చ తెరపైకి వచ్చింది. దిశ హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్ కౌంటర్ కావడంతో జనం సంబరాలు చేసుకున్నారు. సీపీ సజ్జనార్ కు జైజైలు పలికారు. వరంగల్ యాసిడ్ దాడి నిందితుల ఎన్ కౌంటర్ లోనూ ఇదే విధమైన ప్రతిస్పందన కనిపించింది. కానీ నిర్భయ కేసు విషయానికి వచ్చేసరికి చివరి క్షణం వరకూ ఆమె తల్లిదండ్రులు పోరాడాల్సి వచ్చింది. ఓ దశలో నిర్భయ తల్లి ఆశాదేవి సైతం తమ బిడ్డను పొట్టనపెట్టుకున్న క్రూరులను ఎన్ కౌంటర్ చేయడమే బెటరని వ్యాఖ్యానించారు.

ఒక విధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం తప్పు. అది పోలీసులకు కూడా వర్తిస్తుంది. కానీ నిర్భయ కేసు చూసిన తర్వాత అదే కరెక్టనే అభిప్రాయం ప్రజల్లో పాతుకుపోతోంది. ఏపీ సింగ్ వంటి అతి తెలివైన లాయర్లు న్యాయవవస్థతో ఆడుకోవడం కూడా తప్పేనంటున్నారు. ఇప్పటికైనా మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయాల్సిందేనని స్పష్టంచేస్తున్నారు. ఈ కారణంగానే కదా.. చిలకలూరిపేట బస్సు దహనం కేసు దోషులు చివరి క్షణంలో ఉరిని తప్పించుకున్నారు. ఇలాంటివి జరగకుండా దోషులకు శిక్ష పడాలంటే మన వ్యవస్థలో సమూల మార్పులు జరగాల్సిందే.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...