కాంగ్రెస్ రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనకు రెండేళ్లపాటు జైలు శిక్ష పడటం తో ఆయనపై అనర్హత వేటు కూడా పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో నెలరోజుల్లోపు ఆయన అధికారిక బంగ్లాను ఖాళీ చేయాలంటూ లోక్సభ హౌసింగ్ కమిటీ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 22 లోపు బంగ్లాను వదిలి వెళ్లాలని ఆదేశించినట్లు సమాచారం.
2004లో ఆయన ఎంపీగా ఎన్నికైన తర్వాత ఢిల్లీలోని తుగ్లక్ లేన్ లోని 12 వ నంబరు బంగ్లాను కేటాయించారు. అప్పటినుంచి రాహుల్ ఆ బంగ్లాలోనే నివాసం ఉంటున్నారు.అయితే ఇప్పుడు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో 19 ఏళ్ల పాటు నివాసం ఉన్న ఇంటిని వదిలి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
మరోవైపు సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై కౌంటర్ దాఖలు చేసేందుకు 30 రోజులపాటు గడువు ఉంది. అయినప్పటికీ కోర్టు తీర్పు వచ్చిన మరుసటి రోజు రాహుల్ పై అనర్హత వేటుపడింది. ఆ వెంటనే ఇప్పుడు ఈ నోటీసులు కూడా జారీ అయ్యాయి.దీనిపై రాహుల్ గాంధీ స్పందించారు. తమ టీంకు ఎలాంటి నోటీసులు అందలేదని పేర్కొన్నారు.
494037 918254Some genuinely intriguing info, nicely written and broadly user pleasant. 149795
768228 892840There is noticeably a lot to know about this. I believe you created some nice points in capabilities also. 284722