శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో విదేశీ కరెన్సీ పట్టుబడింది. బూందీ ప్యాకెట్ లో దాదాపుగా రూ.55 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ కట్టలను గుర్తించిన కస్టమ్స్ అధికారులు వెంటనే సీజ్ చేశారు. ఈ డబ్బును దుబాయ్ కి తరలించేందుకు ప్రయత్నించారు. అధికారులు కాస్త అప్రమత్తంగా ఉండటంతో దొంగలు దొరికారు. మలక్ పేటకు చెందిన ఆయూబ్ మరియు అహ్మద్ పాషాలు ఈ డబ్బును దుబాయికి తరలించేందుకు ప్రయత్నించినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
బూందీని పార్శిల్ గా తీసుకు పోతున్నట్లుగా చెప్పిన వారిద్దరు బూందీ ప్యాకిట్లను ఓపెన్ చేయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలు చెప్పక పోవడంతో పాటు అక్రమంగా డబ్బును తరలించేందుకు ప్రయత్నించిన వారిద్దరిపై కేసును నమోదు చేసినట్లుగా పోలీసులు చెప్పారు. ప్రస్తుతం వారిద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. వారికి సంబంధించిన వివరాలను పోలీసులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
845603 525894I discovered your blog site on google and verify a few of your early posts. Continue to preserve up the superb operate. I simply extra up your RSS feed to my MSN News Reader. Searching for forward to reading extra from you in a even though! 129396
632808 576957I undoubtedly did not realize that. Learnt something new today! Thanks for that. 527322