నారాయణ పేట జిల్లా దామరగిద్ద మండలం మొగల్మడ్క పంచాయతి నంద్యా నాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. తండాకు చెందిన రాములు నాయక్ అనే వృద్దుడు అనారోగ్యంతో హైదరాబాద్లో మృతి చెందాడు. అతడి మృతదేహంను తండాకు తీసుకు వెళ్లి అంత్య క్రియలు నిర్వహించారు. అంత్య క్రియల్లో పాల్గొనేందుకు అతడి కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అంతా కూడా తండాకు చేరుకున్నారు. అంత్య క్రియల తర్వాత స్నానాలు చేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో రాములు నాయక్ అయిదుగురు మనుమళ్లు చెరువులో స్నానంకు వెళ్లారు.
చెరువులోకి వెళ్లే సమయంలో ఒకరిని ఒకరు పట్టుకోవడంతో అంతా కూడా నీటిలోకి జారిపోయారు. మొత్తం అయిదు మందిలో ఒక్కడు కేకలు పెట్టడంతో అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి గుర్తించి వెంటనే కాపాడాడు. 9 ఏళ్ల విశాల్ ప్రాణాలతో బయట పడగా అర్జున్, అరుణ్, గణేష్ మరియు ప్రవీణ్ లు మృతి చెందారు. అరుణమ్మ కర్ణాటక పుట్పాక్ నుండి వచ్చారు. తండ్రి అంత్యక్రియల కోసం వచ్చి కొడుకును పోగొట్టుకున్న అరుణమ్మ కన్నీరు మున్నీరు అయ్యింది.
19674 912718Yay google is my world beater aided me to uncover this outstanding web website ! . 541601
387431 213116You produced some very good points there. I did a search on the topic and discovered most people will agree together with your weblog. 101096
698402 218120Totally composed content material , thankyou for information . 718212