బెంగళూరుకు చెందిన రబీజ్ ఆరాఫత్ యూకేలో నర్సింగ్ ఎంఎస్ చేస్తున్నాడు. కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహిస్తున్నారు. ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ క్లాస్ లు వింటున్న రబీజ్ కు ఫోన్ రావడంతో బయటకు వెళ్లాడు. బయటకు వచ్చిన రబీజ్ ను మాటు వేసి ఉంచిన కిడ్నాపర్స్ తమ కార్లోకి లాక్కుని వెళ్లారు. అతడి తండ్రికి ఫోన్ చేసి రూ.2 కోట్లు డిమాండ్ చేశారు. విషయం పోలీసులకు చెప్పిన తండ్రి డబ్బు ఇస్తానంటూ కిడ్నాపర్స్ ను నమ్మించాడు. మెల్లగా పోలీసులు తమ పని తాము చేసుకుంటూ పోయారు.
పోలీసులు నాలుగు టీమ్ లుగా విడిపోయి సీసీ కెమెరాలను పరిశీలించి రబీజ్ తండ్రి ఫోన్ కు వచ్చిన కాల్ ఆధారంగా ఎంక్వౌరీ మొదలు పెట్టారు. రబీజ్ కిడ్నాప్ అయిన ఏడు గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కిడ్నాపర్స్ అప్పుల బాధతో ఈ పని చేశామని ఒప్పుకున్నారు. డబ్బున్న వారి కోసం కొన్ని వారాల వరకు రెక్కీ నిర్వహించి ఆ తర్వాత ఈ పని చేశామని అన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాపర్స్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఏడు గంటల్లోకే కిడ్నాప్ కేసును తేల్చిన పోలీసులను ప్రజలు అభినందిస్తున్నారు.
34884 970819Outstanding post, I conceive men and women should larn a whole lot from this internet site its actually user genial . 571845