ఉత్తర ప్రదేశ్ లో నిన్న సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏకంగా 17 మంది మృతి చెందినట్లుగా పోలీసు వర్గాల వారి ద్వారా సమాచారం అందుతోంది. బస్సు మరియు జేసీబీ ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంకు బస్సు అతి వేగమే కారణంగా ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయాల పాలు అయ్యారు. బస్సులో ఇరుకున్న వారిని బయటకు తీసేందుకు చాలా సమయం కష్టపడాల్సి వచ్చింది.
కన్పూర్ జిల్లా సంచేది ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. స్లో గా వెళ్తున్న జేసీబీని స్పీడ్ గా వస్తున్న బస్సు ఢీ కొట్టింది. జేసీబీ రోడ్డు పక్కకు పడిపోగా బస్సు మూడు నాలుగు ఫల్టీలు కొట్టింది. రోడ్డు పక్కన ఉన్న గుంతలో బస్సు పడిపోయింది. యాక్సిడెంట్ పై వెంటనే సీఎం యోగి ఆధిత్యనాథ్ స్పందించారు. చనిపోయిన వారి కుటుంబాలకు రెండు లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చేందుకు ఓకే చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనపై స్పందించి విచారం వ్యక్తం చేశారు. ప్రధాని సహాయ నిధి ద్వారా కూడా రెండు లక్షల ఎక్స్ గ్రేషియాను ఇవ్వబోతున్నట్లుగా పేర్కొన్నారు.
735878 346523You can certainly see your expertise within the work you write. 584098
386879 124647I was wondering if you ever considered changing the page layout of your blog? Its very well written; I love what youve got to say. But maybe you could a little more in the way of content so people could connect with it better. Youve got an awful lot of text for only having one or 2 images. Maybe you could space it out better? 521959