దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని అమర్ నాధ్ గుహలోని మంచు శివలింగాన్ని దర్శించుకునే యాత్ర జూన్ 30న ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే.. శుక్రవారం సాయంత్రం క్షేత్రానికి సమీపంలో భారీ వర్షాలు పడటంతో చూస్తూండగానే కొండల పైనుంచి వరద, బురద, కొండరాళ్లు కొట్టుకొచ్చాయి. దీంతో ఆ ప్రాంతమంతా వర్షపు నీరు ముంచెత్తింది.
ఘటనలో 16 మంది యాత్రికులు మృతి చెందారు. 65 మంది గాయపడ్డారు. 40 మంది గల్లంతయ్యారు. తొక్కిసలాటలో గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం అమరనాధ్ యాత్రను నిలిపివేశారు. 15వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుహ వద్ద వేలాది మంది చిక్కుకుపోయారు. ప్రస్తుతం గుహ వద్ద భారీ వర్షం కురుస్తోంది. విపత్తు నేపథ్యంలో జమ్ము-కశ్మీర్ అధికార యంత్రాంగం.. అమర్ నాధ్ క్షేత్రం బోర్డుతో కలిసి సమాచారం కోసం కొన్ని ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచింది.
ఎన్డీఆర్ఎఫ్: 011-23438252, 011-23438253
అమర్ నాధ్ బోర్డు: 0194-2313149
కశ్మీర్: 0194-2496240
3178 622178Das beste Webdesign Berlin erhalten Sie bei uns, genauso wie professionelles Webdesign. Denn wir sind die Webdesign Agentur mit pfiff. 96371
299 715505i was just browsing along and came upon your web site. just wantd to say wonderful job and this post actually helped me. 570574
752030 576203Reading, watching movies or plays, or related activities that may bring inspiration. 449578
139548 546902Dead written articles , Genuinely enjoyed reading . 502257