దేశ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో ఆక్సీజన్ కు షాటేజ్ వచ్చింది. పలు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు ఆక్సీజన్ అందించడానికి అవసరం అయినంత లేదు. దాంతో ఉన్నట్లుండి ఆక్సీజన్ ట్యాంక్ లు నిండుకోవడం వల్ల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఇప్పటికే దేశం లో పలు రాష్ట్రాల్లో ఆక్సీజన్ సరఫరా నిలిచి పోవడం వల్ల పదుల సంఖ్యలో కరోనా పేషంట్స్ మృతి చెందారు. నేడు తెల్లవారు జామున తమిళనాడులో ఆక్సీజన్ సరఫరా నిలిచి పోయి 11 మంది మృతి చెందారు.
తమిళనాడు చెంగల్ పట్టు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విషాదం చోటు చేసుకుంది. కరోనాతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న వారు పలువురు ఆక్సీజన్ అందక పోవడంతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. చివరకు 11 మంది ఆక్సీజన్ లేమితో తుది శ్వాస విడిచారు. ఆక్సీజన్ నిండుకుని ఈ సంఘటన జరిగిందా లేదంటే టెక్నికల్ సమస్య వల్ల ఆక్సీజన్ సరఫరా నిలిచి పోయిందా అనే విషయాన్ని ఎంక్వౌరీ చేసి వెళ్లడించాల్సి ఉంది.
945655 315695I enjoy what you guys are generally up too. This kind of clever function and reporting! Keep up the quite good works guys Ive added you guys to blogroll. 232531
989045 673582Just wanna comment which you have a really good internet site , I really like the style it in fact stands out. 705629
538640 930166There is noticeably lots of funds to comprehend about this. I assume youve made certain nice points in capabilities also. 631675