తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ సేవలు విస్తృతమవ్వాలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే నాలుగేదేళ్లలో జిల్లాలకు ఐటీ విస్తరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కరీంనగర్ లో 34కోట్లతో నిర్మించి ఐటీ హబ్ ను మంత్రి ప్రారంభించారు. కరీంనగర్లో స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు టీ హబ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రస్తుతం ఐటీ నిర్వచనం మారుతోందని.. ఐటీ అంటే ఇంటెలిజెంట్ టెక్నాలజీ అని అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కంటే ఇప్పుడు ఐటీ ఎగుమతులు పెరిగాయన్నారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతుల విలువ 1.28 లక్షలని పేర్కొన్నారు. నైపుణ్యం ఎవరి సొత్తూ కాదని.. పట్టణ, గ్రామీణ యువత కూడా ఐటీలో రాణిస్తున్నారని అన్నారు. ఇప్పటికే వరంగల్ లో నిర్మించిన ఐటీ టవర్ లో కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. స్వదేశంలో ఐటీ కంపెనీలు పెట్టాలనుకునే వారికి, స్టార్టప్ లకు ప్రోత్సాహం ఇస్తామని అన్నారు. హైదరాబాద్ లోని కంపెనీలు తమ కార్యకలాపాలను ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలని ఈ సందర్భంగా కోరారు. ఇందుకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామన్నారు.
వరంగల్, కరీంనగర్, నిజమాబాద్.. వంటి చోట్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడుతున్నాయన్నారు. స్టార్టప్ లను ప్రోత్సహిస్తే మరిన్ని ఆవిష్కరణలు వస్తాయని అన్నారు. కరీంనగర్ ఇప్పుడు వేగంగా అభివృద్ధఇ చెందుతోందని అన్నారు. తాను ఇక్కడే పుట్టి, చదువుకున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. గతంలోకంటే ఇప్పుడు బాగా అభివృద్ధి చెందిందని అన్నారు.
32116 765952What a lovely blog. I will definitely be back. Please keep writing! 679878
110847 559385We clean up on completion. This might sound obvious but not numerous a plumber in Sydney does. We wear uniforms and always treat your home or office with respect. 928201
951247 911682so significantly fantastic info on here, : D. 239336