కరోనా మూడో దశను ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ రాష్ట్ర వైద్య సంచాలకులు శ్రీనివాసరావు హైకోర్టుకు విన్నవించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, ఆసుపత్రులపై చర్యలు వంటి అంశాలపై హైకోర్టు చేపట్టిన విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ప్రభుత్వాసుపత్రుల్లో పడకలను ఆక్సిజన్ పడకలుగా మారుస్తున్నమని.. ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించామన్నారు మరో 14 ఆర్టీపీపీసీఆర్ ల్యాబ్స్ వస్తున్నాయన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వసూలు చేసిన అధిక ఫీజులను బాధితులకు అప్పగించారా అని ప్రశ్నించింది హైకోర్టు.
మొదటి దశలో వారికి గతంలో 3కోట్లు ఇప్పించామని చెప్పగా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆసుపత్రుల అనుమతులు రద్దు చేశామని శ్రీనివాసరావు తెలిపారు. మెడపై కత్తి పెట్టి వసూలు చేసి బాధితులకు డబ్బు ఇప్పించాలి కానీ.. తల నరికేస్తే ఎలా? అని హైకోర్టు ప్రశ్నించింది. లైసెన్సులు రద్దు చేస్తే బాధితులకు డబ్బు తిరిగి ఇవ్వవు కదా? అని ప్రశ్నించింది. ప్రైవేటు ఆసుపత్రుల గరిష్ట ధరలు సవరించి వెబ్ సైట్లో పెట్టి అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
657723 896181You created some decent points there. I looked on the internet for that issue and located most individuals will go together with with the site. 552977
510645 555305never saw a site like this, relaly impressed. compared to other blogs with this article this was definatly the best internet site. will save. 924894