Switch to English

ఏపీ వర్సెస్‌ తెలంగాణ.. ‘కరోనా’పై పోరులో ఎవరు గొప్ప.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో నిన్న దాదాపు 8 వేల కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఈ సంఖ్య 1567 మాత్రమే. మరణాల సంఖ్య కూడా తెలంగాణలో చాలా తక్కువగా వుంది. కానీ, టెస్టుల విషయానికొస్తే.. తెలంగాణలో నిన్న 13 వేలు మాత్రమే జరిగాయి. అదే ఆంధ్రప్రదేశ్‌లో తీసుకుంటే 58 వేల పైన టెస్టులు జరగాయి. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలు గ్రేటర్‌ హైద్రాబాద్‌ కంటే ఎక్కువ కేసులు నమోదు చేశాయి.

కానీ, తెలంగాణలో కరోనా వైరస్‌ ‘కమ్యూనిటీలోకి వెళ్ళిపోయింది..’ అని అధికారులు చెబుతుంటే, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఈ విషయాన్ని అక్కడి అధికారులు ధృవీకరించడంలేదు. హైద్రాబాద్‌ లాంటి అభివృద్ధి చెందిన నగరం ఆంధ్రప్రదేశ్‌కి లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ఏ నగరంలోనూ హైద్రాబాద్‌ స్థాయిలో కాదు కదా, కనీసం అందులో సగం జనాభా కూడా వుండరు. మరి, ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు ఈ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.? అన్నదే మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

నిజానికి కొద్ది రోజుల ముందు వరకూ తెలంగాణలో కరోనా టెస్టులు 10 వేల లోపే జరిగాయి. అప్పుడే కాస్త ఎక్కువగా కేసులు నమోదయ్యాయి. ఓ దశలో 2 వేల కేసులు కూడా దాటాయి. కానీ, టెస్టులు పెరిగాక కేసులు తగ్గిపోయాయి. పైగా, గ్రేటర్‌ హైద్రాబాద్‌ మినహాయిస్తే.. మిగతా జిల్లాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య చాలా తక్కువగానే వుంది. అసలు తెలంగాణలో కరోనా పెద్దగా ప్రభావం చూపడంలేదా.? అన్న అనుమానమొస్తుంది ఇక్కడ నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే. కానీ, విపక్షాలు మాత్రం.. పరిస్థితి చాలా తీవ్రంగా వుందని చెబుతున్నాయి.

మరోపక్క సోషల్‌ మీడియాలో ప్లాస్మా డొనేషన్ల కోసం, ఆసుపత్రుల్లో బెడ్స్‌ కోసం అభ్యర్థనలు కుప్పలు తెప్పలుగా కన్పిస్తున్నాయి.. ఇవన్నీ తెలంగాణలో కరోనా తీవ్రతను చెప్పకనే చెబుతున్నాయి. ‘దాచేస్తే దాగే వ్యవహారం కాదిది..’ అని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా, 25 వేలకు పై బడి కరోనా టెస్టులు ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నకు మాత్రం అధికార పక్షం నుంచి సమాధానం లేదు. నిజానికి, వైద్య రంగం పరంగా చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌ కన్నా తెలంగాణలో వెసులుబాట్లు చాలా ఎక్కువ. తెలంగాణ ప్రభుత్వం తలచుకుంటే రోజుకి లక్ష టెస్టులు చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒక్కటి మాత్రం నిజం.. హైద్రాబాద్‌ మీద కరోనా కారణంగా ‘మచ్చ’ పడితే అది చెరిపేయడానికి వీల్లేనంత పెద్ద మచ్చ అవుతుంది. ప్రభుత్వం ఈ విషయమై ఒకటికి పదిసార్లు కాస్తంత బాధ్యతగా ఆలోచించడం మంచిది.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.. దీనిపై ఎన్టీఆర్ టీమ్ స్పందించింది. ప్రస్తుతం...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...