చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం చిన్న తయ్యూరు గ్రామంలో దారుణం జరిగింది. స్థానిక ఎస్సీ కాలనీకి చెందిన భవన నిర్మాణ కార్మికుడు సుధాకర్ కుటుంబం మొత్తం కలహాలతో కడతేరి పోయింది. భార్య భర్తలతో పాటు వారి ఇద్దరు పిల్లలు కూడా కలహాల కారణంగా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినది. పోలీసులు బంధువులు స్థానికుల కథనం ప్రకారం.. సుధాకర్ మరియు ప్రియలకు ఎనిమిది సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. మొదట్లో బాగానే ఉన్నా ఆ తర్వాత ఇద్దరి మద్య గొడవలు ప్రారంభం అయ్యాయి.
ఈమద్య కాలంలో సుధాకర్ మద్యంకు బానిస అయ్యాడు. దానికి తోడు కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ తో తీవ్రమైన ఆర్థిక సమస్యలు తలెత్తాయి. తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో సుధాకర్ ప్రవర్తనతో ప్రియ తీవ్ర మనోవేదనకు గురైంది. ఇద్దరు కూతుర్లతో కలిసి గ్రామ శివారులో ఉన్న బాయిలో దూకి చనిపోయింది. అనుమానం వచ్చిన సుధాకర్ బాయి వద్దకు వెళ్లి చూడగా అందులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దాంతో అక్కడే ఒక చెట్టుకు సుధాకర్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు సుధాకర్ ను గుర్తించారు. పక్కనే బాయిలో తల్లి కూతుర్ల శవాలను కూడా పోలీసులు బయటకు తీశారు.