దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆనందయ్య మందుపై ఇప్పటికే పరీక్షలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో టీటీడీ ఆయుర్వేద నిపుణుల ఆధ్వర్యంలో కూడా పరిశోధనలు ప్రారంభయ్యాయి. దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ‘ఆనందయ్య మందు కోవిడ్ పై ప్రభావం చూపిస్తోందని ప్రజల్లో మంచి నమ్మకం ఏర్పడింది. దీనిపై ఆయుష్ నుంచి నివేదిక రావాల్సి ఉంది. ఈమేరకు ఆయుష్ నుంచి టీటీడీ అధ్వర్యంలోని ఆయుర్వేద కాలేజీకి నివేదిక పంపారు.’
‘ఇప్పటికే జరిగిన క్లినికల్ ట్రయల్స్ పై మినిస్ట్రీ ఆష్ ఆయుష్ నిర్ణయం తీసుకోనుంది. ఆయుర్వేద కాలేజీలో మందును తయారు చేసి 500 మందిపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తాం. ఈ నివేదిక వచ్చేందుకు వారం పడుతుంది. నివేదికను కేంద్రానికి, రాష్ట్రానికి పంపాం. టీటీడీ తరఫున మందు తయారుచేసి ప్రజలకు పంపిణీ చేయమని సీఎం ఆదేశిస్తే అందుకు సిద్ధంగా ఉన్నాం. కేంద్రం ఈ మందుకు అనుమతులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వమే ఈ మందును అందరికీ అందిస్తుంది’ అని అన్నారు.
973398 983263I adore gathering valuable info, this post has got me even far more info! . 716265
801653 971552Thank you for sharing with us, I conceive this site truly stands out : D. 977730