నేడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లోని 19 స్థానాలకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికయ్యే నాలుగు స్థానాల కోసం వైసీపీ నుంచి మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని మరియు టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేశారు. ఏపీలో 175మంది ఎమ్మెల్యేలకు గాను 173మంది ఓటేశారు. ఓటువేయని ఇద్దరు ఎమ్మెల్యేలలో ఒకరు ఈఎస్ఐ కేసులో భాగంగా రిమాండ్లో ఉన్న అచ్చెన్నాయుడుకి అనుమతి దొరకకపోవడంతో ఆయన ఓటేయ్యలేదు. అలాగే అనగాని సత్యప్రసాద్ కూడా హోమ్ క్వారంటైన్ కారణంగా ఓటేయ్యలేదు.
ఎన్నికలు పూర్తయ్యే టైంకి నాలుగు రాజ్యసభ స్థానాలు తమవేనని వైకాపా ధీమా వ్యక్తం చేసింది. వారు అనుకున్నట్టుగానే వైఎస్సార్సీపీనే నాలుగు రాజ్యసభ స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో పోటీచేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి, అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వానిలు గెలుపొందారు. ప్రతి ఒక్కరికీ 38 ఓట్లు పోల్ అయ్యాయని అధికారులు అనౌన్స్ చేశారు. టీడీపీ నుంచి పోటీ చేసిన వర్ల రామయ్య మాత్రం 17 ఓట్లు పొంది ఓడిపోయారని సమాచారం.
ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమిటంటే.. రాజ్యసభ ఎలక్షన్ లో మొదట నాలుగు అనుకున్నా తాజాగా 5 చెల్లని ఓట్లేసి టిడిపి అభ్యర్థి వర్ల రామయ్యకి షాకిచ్చిన రెబల్ ఎమ్మెల్యేలు. అనుకున్నట్లుగానే కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీలు షాకిచ్చారు కానీ ఆ నాలుగో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కావడం విశేషం. భవాని అవగాహనా లోపం వల్లే ఇలా చేసారని సమాచారం. ఒకటని పెట్టాల్సిన ప్రాధాన్యత స్థానంలో టిక్ మార్క్ పెట్టడంవలనే ఈ ఓట్లు చెల్లలేదని అధికారులు తెలిపారు.
128365 800912You got a really very good internet site, Gladiola I discovered it via yahoo. 412093
416233 3022Youd superb suggestions there. I did a research about the issue and identified that likely almost anyone will agree together with your web page. 867521
121775 303475i could only wish that solar panels cost only several hundred dollars, i would love to fill my roof with solar panels- 359036
831527 973257Absolutely pent subject matter, appreciate it for selective information . 79237