ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికల రగడ జరుగుతున్నది. ఎన్నికలను ఎన్నికల కమిషనర్ వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడానికి వైకాపా పార్టీ జీర్ణించుకోలేకపోతున్నది. ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని మండిపడుతున్నాడు. కరోనా బూచి చూపించి ఎన్నికలు వాయిదా వేస్తారా అలా చేయడం సమంజసమేనా అంటూ ప్రశ్నించింది. ఎన్నికల కమిషనర్ మాత్రం తాను తీసుకున్న నిర్ణయాలను సమర్ధించుకుంటున్నారు.
అత్యవసర సమయంలో ప్రజలకు సమాచారం అందించేందుకు ఇలానే ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తామని, తాను రాజ్యాంగబద్దంగానే నడుచుకున్నట్టు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాలను మాత్రం వైకాపా ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకించింది. రాజ్యాంగ బద్దమైన పదవుల్లో కూర్చున్న వ్యక్తులు కూడా మరో రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తిని దూషిస్తూ మాట్లాడటం అన్నది మంచిది కాదు.
స్పీకర్ పదవిలో ఉన్న వ్యక్తి ఎన్నికల కమిషర్ ను తిట్టడం అంటే దారుణమైన విషయం అని చెప్పాలి. అంతకంటే దారుణమైన విషయం మరొకటి కాదు. ఎన్నికల కమిషన్ కు కొన్ని అధికారాలు ఉంటాయి. స్పీకర్ కు విచక్షణా అధికారాలు ఉన్నట్టుగానే ఎన్నికల కమిషనర్ కూడా అధికారులు ఉంటాయి.
కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించిన తరువాతే ఎన్నికల కమిషనర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడితే… కేంద్రం కరోనాను జాతీయ విపత్తుగా ప్రకటించడం కూడా తప్పే అవుతుంది కదా. మరి జగన్ సర్కార్ కేంద్రం తీసుకున్న జాతీయ విపత్తు నిర్ణయంపై కూడా వైకాపా సుప్రీం కోర్టులో సవాల్ చేయాలి కదా అలా చేస్తుందా? చేసే ధైర్యం వైకాపా ప్రభుత్వానికి ఉన్నదా? ఒకవేళ ఆ దిశగా మాట్లాడితే… అన్ని రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయానికి వైకాపా వ్యతిరేకంగా ఉన్నట్టే కదా…!!
498140 844568I savor, lead to I discovered exactly what I used to be looking for. 653947