Switch to English

కరోనా కట్టడి: ఆంధ్రప్రదేశ్‌లో అదిరిపోయిందంతే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

‘కరోనా కట్టడిలో ఇతర రాష్ట్రాల కంటే ముందున్నాం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాల పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.. విపక్షాలే అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి..’ అంటూ అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ప్రభుత్వ పెద్దలు.. మరీ ముఖ్యంగా మంత్రులు మీడియా ముందుకొచ్చి ప్రకటనలు గుప్పించేస్తున్నారు.. విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

మరోపక్క ‘ప్రెస్ మీట్లు పెట్టి హంగామా చేయడం కాదు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితుల్ని తెలుసుకోండి..’ అంటూ బాధితులు ఆసుపత్రుల వద్ద సౌకర్యాలు లేక కన్నీరు మున్నీరవుతూ, ప్రభుత్వ పెద్దలపై శాపనార్థాలు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత గొప్పగా ‘కరోనా వైరస్’ని కట్టడి చేసేస్తోందో తెలుసా.? రోజువారీ కేసులు ఏకంగా ఇరవై వేల పైబడి ప్రతిరోజూ నమోదయ్యేంతలా. ఈ పరిస్థితి ఎప్పటికి అదుపులోకి వస్తుందో తెలియని పరిస్థితి. ఇంకో వైపు వ్యాక్సినేషన్ విషయంలోనూ తీవ్ర గందరగోళం కనిపిస్తోంది.

అవసరమైనన్ని రెమిడిసివిర్ ఇంజెక్షన్లను అందుబాటులో వుంచుతున్నామని ప్రభుత్వం చెబుతోంది.. కానీ, కరోనా బాధితులేమో.. రెమిడిసివిర్ దొరక్క నానా పాట్లూ పడుతున్నారు.. బ్లాక్ మార్కెట్టులో మాత్రం రెమిడిసివిర్ ఇంజెక్షన్ 30 వేల నుంచి 50 వేలు.. ఆ పైన ధర చెల్లిస్తే, తేలిగ్గానే దొరికేస్తోంది. అంటే, రెమిడిసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్టులో లభ్యమవుతుండడం గురించే ప్రభుత్వం చెబుతోందా.? అన్నది కరోనా బాధితుల బంధువుల ఆవేదన. కొత్త కేసులతోపాటు, కొత్తగా చోటు చేసుకుంటున్న మరణాలు కూడా ఆందోళనకరంగానే వుంటున్నాయి.

అధికారిక లెక్కల ప్రకారమే మరణాల సంఖ్య 10కి అటూ ఇటూగా వుంటోంటే.. అనధికారికంగా ఈ లెక్క ఎంత వుంటుందోనన్న భయం రాష్ట్ర ప్రజల్లో కలగడం సహజమే. ఇదిలా వుంటే, కొన్ని జిల్లాల్లో ఓ రోజు అత్యధికంగా కేసులు నమోదైతే, మరో రోజు అదే జిల్లాలో అనూహ్యంగాకేసుల సంఖ్య తగ్గిపోతోంది.. అంటే, ఇక్కడా టెస్టుల్లో లోపం వుందని అనుకోవాలేమో. ఇలా ఇన్ని వైఫల్యాల నడుమ.. కరోనా కట్టడి.. అంటూ ప్రభుత్వ పెద్దలు పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి ప్రజలది.

8 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...