రాష్ట్ర ఎన్నికల కమిషనర్ని కులం పేరుతో సాక్షాత్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి దూషిస్తే.. అది నీఛ రాజకీయం కాదట. ముఖ్యమంత్రి మాత్రమేనా.? మంత్రులు, ఎమ్మెల్యేలు.. చివరికి రాజకీయ విమర్శలకు, రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా వుండాల్సిన అసెంబ్లీ స్పీకర్ కూడా తన స్థాయిని మర్చిపోయారు.. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో.
ఎలాగైతేనేం, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ విషయంలో అడ్డగోలు రాజకీయాలు చేసి, చివరికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరీ.. తమకు అనుకూలమైన వ్యక్తిని ఆ పదవిలో కూర్చోబెట్టుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. సరే, కొత్త కమిషనర్ గతంలో జడ్జిగా పనిచేశారనుకోండి.. అది వేరే విషయం.
వైసీపీ కుట్రలకు బలైపోయిన తాజా మాజీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, న్యాయస్థానాన్ని ఆశ్రయించారు తనకు జరిగిన అన్యాయంపై. ఇక, కొత్త ఎలక్షన్ కమిషనర్ విషయమై సోషల్ మీడియా వేదికగా కుప్పలు తెప్పలుగా పోస్టింగ్స్ కన్పిస్తున్నాయి. ఆయన క్రిస్టియన్ అని కొందరు.. వైసీపీ ఎంపీ (రాజ్యసభ) విజయసాయిరెడ్డితో ‘ఏవో’ సంబంధాలు వున్నాయని కొందరు.. తమ తమ అభిప్రాయాల్ని సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారమంతా నిజమని నమ్మలేం. అలాగని, అవన్నీ పూర్తి అవాస్తవాలుగా కొట్టి పారేయలేం. కొత్త కమిషనర్పై ‘నెగెటివ్’ ప్రచారాలకు పాల్పడుతున్నవారిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. నిజమే, దుష్ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకోవాల్సిందే. అయితే, సాధారణ వ్యక్తులకు చట్టం ఒకలా పనిచేస్తే, పదవుల్లో వున్నవారి పట్ల చట్టం ఇంకోలా పనిచేస్తుందా.? అన్నదే అసలు ప్రశ్న.
అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్పై కులం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్.. ఇలా అందరూ విరుచుకుపడిపోయారు. మరి, ఆ విమర్శలపై చర్యలుండవా.? అసలు, ‘నీఛ రాజకీయాల’ గురించి మాట్లాడే నైతిక హక్కు వైఎస్సార్సీపీకి వుందా.?
360006 901774Hello there! Good post! Please inform us when I will see a follow up! 315109
267733 71784Hello! I would wish to supply a large thumbs up for your outstanding info you can have here about this post. Ill be coming back to your weblog site for further soon. 317760