రాష్ట్రంలో సంచలనం రేపిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివేకాకు సంబంధించిన రికార్డులను తమకు ఇవ్వాలని పులివెందుల కోర్టులో పిటిషన్ వేశారు. తమకు ఆదేశాలు లేవని గతంలోనే పులివెందుల మేజిస్ట్రేట్ సీబీఐకి తెలిపారు. దీంతో సీబీఐ ఈ నెల 2న హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు పులివెందుల మేజిస్ట్రేట్ కు కీలక ఆదేశాలు జారీ చేసింది.
‘వివేకా హత్య కేసుకు సంబంధించి రికార్డులను సీబీఐకు వెంటనే అందజేయండి’ అని పులివెందుల మెజిస్ట్రేట్కు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సీబీఐ అధికారులు ఈమేరకు రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టి ఈ ఆదేశాలు జారీ చేసింది.
గతంలో వివేకా హత్యకేసును సీఆర్పీసీ 174 సెక్షన్ కింద అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఐపీసీ 302 సెక్షన్ ప్రకారంగా నమోదు చేసింది. ఈ కేసును ఢిల్లీ ప్రత్యేక నేర విభాగంలోని 3వ బ్రాంచి దర్యాప్తు చేస్తోంది. త్వరలోనే ఓ ప్రత్యేక టీమ్ ఈ కేసులో దర్యాప్తు ప్రారంభించనుంది.
899144 592197genuinely excellent post, i surely really like this web site, maintain on it 672652