న్యూ ఇయర్ సందర్భంగా వైఎస్ షర్మిల( YS Sharmila) గుడ్ న్యూస్ చెప్పారు. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి కి తన స్నేహితురాలు ప్రియ అట్లూరి తో పెళ్లి ఫిక్స్ అయినట్లు వెల్లడించారు. దీంతోపాటు పెళ్లి తేదీని కూడా ప్రకటించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు.
‘ ఈ 2024 సంవత్సరంలో నా కుమారుడు వైఎస్ రాజారెడ్డి తన స్నేహితురాలు ప్రియా అట్లూరి తో ఏడడుగులు వేయనున్నారు. ఈనెల 18న నిశ్చితార్థ వేడుక, వచ్చే నెల 17న వివాహం జరగనుంది. ఈ సందర్భంగా మా కుటుంబం అంతా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైయస్సార్ ఘాట్ వద్ద తొలి ఆహ్వాన పత్రికను ఉంచి నాన్న ఆశీర్వాదం తీసుకుంటాం’ అని షర్మిల తన ట్వీట్ లో పేర్కొన్నారు.
రాజారెడ్డి, ప్రియ అట్లూరి స్నేహితులు. ప్రియ చట్నీస్ అధినేత ప్రసాద్ అట్లూరి మనవరాలు. వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. వీరికి అక్కడ పౌరసత్వం కూడా ఉంది. గత నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. ఇటీవలే వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిపై ఇప్పటివరకు స్పందించని షర్మిల.. ఈరోజు తన కొడుకు పెళ్లి డేట్ ని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.