ఏపీ రాజకీయాల్లో నిమ్మగడ్డ రమేష్ వ్యవహారం చాలా విచిత్రంగా ఉంది. ఒక ఎలక్షన్ కమీషనర్ అయిన నిమ్మగడ్డ రమేష్ రాజకీయ నాయకులకు ముఖ్యంగా అధికార పార్టీ నాయకులకు పదే పదే చిరాకు తెప్పించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నిమ్మగడ్డ రమేష్ గత ఏడాది మున్సిపల్ ఎన్నికలను కరోనా కారణంగా అర్థాంతరంగా ఆపేశాడు. సీఎం జగన్ కు ఇష్టం లేకుండానే ఆ నిర్ణయంను తీసుకున్నాడు. దాంతో జగన్ ఈగో హర్ట్ అయ్యింది. ఇక ఈ ఏడాది ఆయన పంచాయితీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నించగా జగన్ అడ్డుకున్నాడు.
కోర్టుకు వెళ్లి మరీ అనుమతులు తీసుకుని తాను అనుకున్నట్లుగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాడు. అలాగే మున్సిపల్ ఎన్నికల విషయంలో కూడా సీఎస్ అస్సలు ప్రభుత్వ నిర్ణయాలను పట్టించుకోలేదు. ఇప్పుడు పరిషత్ ఎన్నికలు నిర్వహించాలంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి కోరుతూ ఉంటే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ మాత్రం ఇప్పుడు ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు అంటూ తేల్చి చెప్పాడు. త్వరలో తాను రిటైర్ అవ్వబోతున్నాను కనుక ఎన్నికల నిర్వహణపై కొత్త ఎస్ఈసీలు నిర్ణయం తీసుకోవాలని అన్నాడు. దాంతో జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశ్యం తోనే ఎన్నికలను ఆలస్యం చేస్తున్నారు అంటూ వైకాపా నాయకులు నిమ్మగడ్డపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
215024 547467Woh I like your content , saved to favorites ! . 602030
761897 181801Its great as your other articles : D, appreciate it for putting up. 577517