ఏపీ ప్రభుత్వం సివిల్ సప్లయ్ విషయంలో సంచలన మార్పులను తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇకపై రేషన్ షాప్స్ కాకుండా డోర్ డెలవరీ చేయాలని నిర్ణయించుకున్న విషయం తెల్సిందే.
అందుకోసం రాష్ట్రంలో కొత్తగా 9260 డోర్ డెలవరీ వాహనాలను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లుగా పేర్కొన్నారు. ఈ వాహనాలను నిరుద్యోగులకు మరియు బీసీ ఎస్సీ ఎస్టీ వారికి ఇవ్వబోతున్నారు. ఇదే కాకుండా మరో కొత్త నిర్ణయానికి కూడా ప్రభుత్వం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు రేషన్ పై బియ్యం తక్కువ రేటుకు ప్రభుత్వం ఇస్తూ వస్తోంది. అయితే కొంత మంది ఆ బియ్యం పట్ల ఆసక్తి చూపడం లేదు. కనుక బియ్యం అవసరం లేని వారికి వారి ఖాతాలో డబ్బు జమ చేయాలనే నిర్ణయానికి కూడా వచ్చారట.
ఈ విషయంలో ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో అమలు చేయాలని అనుకుంటున్నారు. ఆ తర్వాత దానిని బట్టి మొత్తం రాష్ట్రంలో అమలు చేయవచ్చు. కిలో బియ్యంకు 20 నుండి 25 రూపాయల చొప్పున ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇది నిజంగా సంచలన నిర్ణయం అంటున్నారు.
587026 103753You should get involved in a contest very first of the greatest blogs more than the internet. Ill recommend this page! 714216