ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి.. తన ‘మాస్టర్ ప్లాన్’ని అమల్లో పెట్టారు. మూడు రాజధానులకు సంబంధించి త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం వెల్లడించనున్న దరిమిలా, ఈ లోపలే తెలుగుదేశం పార్టీకి తీవ్ర స్థాయిలో గండి కొట్టాలనే ఆలోచన చేస్తున్నారట సీఎం వైఎస్ జగన్.
గుంటూరు జిల్లాకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే, ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సమావేశమయిన విషయం విదితమే. పార్టీ మారడంపై ఆయన స్పష్టతతో వున్నారు. ‘వైసీపీలో చేరే అవకాశం లేకపోతే, అసెంబ్లీలో ప్రత్యేక సభ్యుడిగా వుండేందుకు స్పీకర్ని అనుమతి కోరతాను’ అంటూ ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
రాజధాని అమరావతిలో తీవ్ర రూపంలో రైతులు ఆందోళన చేస్తోంటే, గుంటూరు జిల్లాకే చెందిన టీడీపీ ఎమ్మెల్యేని వైఎసీపీ వైపుకు తిప్పుకోవడంలో వైఎస్ జగన్ రాజకీయ వ్యూహం సుస్పష్టం. మొత్తంగా ఐదుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైసీపీ వైపుకు వెళ్ళనున్నారనీ, అందులో మద్దాలి గిలి ఒకరనీ, మిగతా నలుగురూ రేపో మాపో వైఎస్ జగన్ మోహన్రెడ్డితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారనీ తెలుస్తోంది.
మరోపక్క, పార్టీకి జరుగుతోన్న డ్యామేజీని కంట్రోల్ చేసుకునే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేకపోవడం గమనార్హం. ఇదిలా వుంటే, జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కూడా, రెండు మూడు రోజుల్లోనే వైఎస్ జగన్తో భేటీ అవుతారట, వైసీపీలో చేరే విషయమై స్పష్టత ఇస్తారట. విదేశాల నుంచి వచ్చిన పవన్, పార్టీ ముఖ్య నేతలతో ఈ రోజు సమావేశమైన విషయం విదితమే. ఇంతలోనే జనసేనకు షాక్ ఇవ్వాలని వైఎస్ జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అన్నట్టు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి దూరంగా వుంటోన్న విషయం విదితమే. ఆయనకు జగన్ అపాయింట్మెంట్ ఇప్పటికే ఖరారయ్యిందని సమాచారమ్.
421496 814771Yours is really a prime example of informative writing. I think my students could learn a good deal from your writing style and your content. I might share this post with them. 97142
241249 345085In the event you have been injured as a result of a defective IVC Filter, you must contact an experienced attorney practicing in medical malpractice cases, specifically someone with experience in these lawsuits. 413926