కృష్ణ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద నిన్న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మొత్తం 12 మంది మృతి చెందిన విషయం తెల్సిందే. మృతులు అంతా కూడా తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన వారు. వేదాద్రికి దైవ దర్శణంకు ట్రాక్టర్లో వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక లారీ ఢీ కొట్టడంతో యాక్సిడెంట్ జరిగింది. వారు ఏ ప్రాంతంకు చెందిన వారు అయినా యాక్సిడెంట్ ఏపీ భూ భాగంలో జరిగింది కనుక మరణించిన వారికి అయిదు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామంటూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి రెండు లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇస్తామంటూ ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. పక్క రాష్ట్రం వారు తమ రాష్ట్రంలో చనిపోయినా కూడా మానవతా దృక్పదంతో జగన్ మోహన్ రెడ్డి సాయం చేసేందుకు ముందుకు రావడం నిజంగా అభినంద నీయం అని, మంచి మనసుతో జగన్ చేస్తున్న ఈ సాయంతో మృతుల కుటుంబాలకు కొంతలో కొంత అయినా ఉపశమనం కలుగుతుందని జనాలు అనుకుంటున్నారు.
298344 599300so significantly great data on here, : D. 772836
115518 912030Some genuinely intriguing information, well written and generally user genial . 779619