ఏపీలో గడచిన 24 గంటల్లో ఏకంగా 425 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇంత భారీ సంఖ్యలో కేసులు నమెదు అవ్వడం ఇదే ప్రథమం. లాక్డౌన్ సడలించినప్పటి నుండి కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. భారీ ఎత్తున కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఇటీవలే ప్రైవేట్ ల్యాబ్స్కు పరీక్షలకు అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఏపీలో ప్రైవేట్ ల్యాబ్స్ చేస్తున్న పరీక్షల్లో గందరగోళం కనిపిస్తుందని వారు సరైన రిపోర్ట్ ఇవ్వడం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇటీవల కరోనా అనుమానంతో నలుగురు విజయవాడలోని టిక్కిల్ రోడ్డులో ఒక ప్రయివేట్ హాస్పిటల్లో టెస్టు చేయించుకున్నారు. ఆ నలుగురికి కూడా నెగటివ్ వచ్చింది. వారు అనుమానంతో మళ్లీ కోవిడ్ హాస్పిటల్ లో కూడా పరీక్షలు నిర్వహించుకోగా ఆ నలుగురికి పాజిటివ్ వచ్చింది. దాంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారుల వద్దకు తీసుకు వెళ్లేందుకు వారు హాస్పిటల్ వద్ద బైటాయించారు. పరీక్షలు నిర్వహించడంలో లోపం కారణంగా వైరస్ మరింత మందికి పాకే అవకాశం ఉందని జనాలు అంటున్నారు. ఒక వైపు కేసులు విపరీతంగా పెరుగుతుంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వారు ఇలా తప్పుడు రిపోర్ట్లు ఇవ్వడంతో చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రైవేట్ ల్యాబ్స్కు అనుమతులు ఇవ్వాల్సిందంటూ కొందరు అంటున్నారు.
541716 863936That is some inspirational stuff. Never knew that opinions could be this varied. Be sure to keep writing. 217798
281916 594879my English teacher hate me cause i maintain writing about somebody from The WANTED called Jay, she gives me evils and low 480982