బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్య కుమార్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తోన్న ‘యాంటీ హిందూ’ విధానంపై సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. గతంలో నిజాం పాలనలో హిందువులు తీవ్ర ఇబ్బందులు పడ్డారనీ, హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయనీ.. ఇప్పుడు అలాంటి పరిస్థితులే వైఎస్ జగన్ పాలనలో ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు. సరాసరి వైఎస్ జగన్ని ‘ట్యాగ్’ చేస్తూ, వై సత్యకుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
‘ఇదే పద్ధతి కొనసాగితే, రాష్ట్రంలో హిందువులు రెలిజియస్ ట్యాక్స్ కట్టాల్సిన రోజులు వస్తాయి’ అంటూ వై సత్యకుమార్ చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం విదితమే. దేవతా మూర్తుల విగ్రహాల్ని ‘అసాంఘీక శక్తులు’ ధ్వంసం చేస్తున్న ఘటనలు రాష్ట్రంలో అనునిత్యం ఏదో ఒక చోట కనిపిస్తూనే వున్నాయి.
మరోపక్క, మొన్న బిట్రగుంట.. నిన్న అంతర్వేది రధం దగ్ధం ఘటనలు హిందూ సమాజంలో మరింత అలజడిని సృష్టిస్తున్నాయి. వీటికి తోడు, రాష్ట్రంలో కనీ వినీ ఎరుగని రీతిలో మత మార్పిడులు జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ అంశాలన్నిటినీ బీజేపీ చాలా సీరియస్గా తీసుకున్నట్లే కనిపిస్తోంది.
‘బీజేపీ వున్నంతకాలం యాంటీ హిందూ ఆలోచనల్ని సాగనివ్వం.. హిందూ సమాజానికి అండగా నిలుస్తాం..’ అంటున్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్. అయితే, ‘రెలిజియస్ ట్యాక్స్’ అనేది ఇప్పటికే చెల్లిస్తున్నామనీ, చర్చిలు.. మసీదుల్లో లేని ‘దర్శన టిక్కెట్ల’ వ్యవహారం హిందూ దేవాలయాల్లో కొనసాగడమే ఇందుకు నిదర్శనమనీ సోషల్ మీడియా వేదికగా హిందూ సమాజం గళం విప్పుతోంది.
If this anti hindu mentality of the Jagan regime goes on, the day will not be too far when Hindus would have to pay "Jaziya" or the religious tax to the state by virtue of being a Hindu!
— Y. Satya Kumar (@satyakumar_y) September 28, 2020