Switch to English

తిరుపతి ఉప ఎన్నిక: ప్రజాస్వామ్యంపై దొంగ ఓటర్ల దాడి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఇదెక్కడి చోద్యం.? బీజేపీకి చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్ పేరుతోనే ఓ దొంగ ఓటరు ఓటేసేందుకు వచ్చాడంటే, తిరుపతి ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా వర్ధిల్లుతోందో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యేక వాహనాల్లో దొంగ ఓటర్లను అధికార పార్టీ తరలిస్తోందని విపక్షాలు టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. రాజకీయాల్లో ఇలాంటి ఆరోపణలు మామూలేనని కొట్టిపారేయడానికి వీల్లేదు. సాధారణంగా ఎన్నికలనగానే ముందుగా దొంగ ఓటర్ల వ్యవహారం తెరపైకొస్తుంటుంది. అయితే, అది చాల తక్కువ సంఖ్యలో వుంటుంది. కానీ, ఏకంగా 4 వేల బస్సుల్లో ఓటర్లను తరలించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఇదేదో ఉత్తుత్తి ఆరోపణ కానే కాదు.

 

అందుకు తగ్గ ఆధారాల్ని విపక్షాలు మీడియా ముందుంచుతున్నాయి. సాధారణంగా ఎన్నికలు జరిగేటప్పుడు, ఆ నియోజకవర్గంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లుంటాయి. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా అవేవీ కన్పించడంలేదు. అనుమానాస్పదంగా పెద్దయెత్తున జనం గుమికూడి వుంటున్నా.. వారిని పోలీసులు అడ్డుకోవడంలేదు. ఎన్నికల వ్యవహారం అని కాదు, కరోనా నేపథ్యంలో అయినా జనాలు గుంపులుగా తిరగకుండా వారించాలి కదా.? అదీ జరగట్లేదు. పైగా, తన ఓటుని ఇంకో వ్యక్తి వేసేస్తున్నారంటూ పోలింగ్ బూత్ ఏజెంట్ ఒకరు వాపోతోంటే, ఆ ఏజెంటుని అక్కడి నుంచి బయటకు పంపేశారట పోలీసులు. ఇదీ తిరుపతిలో ప్రజాస్వామ్యంపై దొంగ ఓటర్లు చేస్తున్న దాడి, అందుకు పోలీసులు వత్తాసు పలుకుతున్న వైనం. దొంగ ఓటర్లు మీడియాకి అడ్డంగా చిక్కినా, వారంతా వైసీపీకి ఓటెయ్యడానికి వస్తున్నారని.. వాళ్ళే ఒప్పుకుంటున్నా, ‘తూచ్.. మాకేం సంబంధం లేదు.. ఇది విపక్షాల కుట్ర..’ అంటున్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

 

పంచాయితీ, మునిసిపల్ ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థుల్ని ఓటర్లను బెదిరించి అధికార పార్టీ ఏకగ్రీవాలు చేసుకుని గెలవగలిగింది.. తిరుపతి ఉప ఎన్నిక కూడా అలాగే ఏకగ్రీవమైపోవాలని వైసీపీ కోరుకుని వుండొచ్చుగాక. ఆ పాచిక పారలేదన్న కారణంగానే, ఇప్పుడు దొంగ ఓటర్లను బరిలోకి దించిందని అనుకోవాలా.? లేదంటే, ఇదంతా విపక్షాల కుట్ర.. అని వైసీపీ చేస్తున్న ఆరోపణల్ని నిజమనుకోవాలా.? ఒక్కటి మాత్రం నిజం.. దేశ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని స్థాయిలో దొంగ ఓటర్లు, ప్రజాస్వామ్యంపై తిరుపతి వేదికగా దాడి చేశారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

హింస, అశాంతి.! ఇది వైసీపీ మార్కు రాజకీయం.!

రాష్ట్రంలో ప్రశాతంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరీ ప్రశాంతంగా కాదుగానీ, ఫర్లేదు.! వైసీపీ ఓటమి ఖాయమని పోలింగ్‌కి ముందే సంకేతాలు రావడంతో, కొన్ని చోట్ల హింసకు తెరలేపాయి వైసీపీ శ్రేణులు. బీసీ, మైనార్టీలు, ఎస్సీ,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...