రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈనెలాఖరు నుంచి జరగాల్సి ఉన్నది. చాలా కాలంగా ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. రెండేళ్ల క్రితమే జరగాల్సిన ఈ ఎన్నికలను అప్పట్లో జరిపించకుండా బాబు పక్కన పెట్టారు. బిసి రిజర్వేషన్ల విషయం కొలిక్కి రాకపోవడంతో అప్పటి నుంచి ఎన్నికలను పక్కన పెడుతూ వచ్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మార్చి నెలాఖరులోగా ఎన్నికలు పూర్తి చేయాలని పట్టుబట్టింది.
దానికి తగినట్టుగానే ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ను కోరింది. ఎన్నికల కమిషన్ కూడా నోటిఫికేషన్ ఇవ్వడం, నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడం, కొన్ని ప్రాంతాల్లో ఏకగ్రీవం కావడం వంటివి జరిగిపోయాయి. అయితే, కొన్ని స్థానాలు ఏకగ్రీవమైన తరువాత రోజే ఎన్నికలను ఆరువారాల పాటు వాయిదా వేస్తూ ఎన్నికల కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు నోట్ విడుదల చేశారు.
దీనిపైనే గత మూడు రోజులుగా రాష్ట్రంలో రగడ జరుగుతున్నది. దీనిపై వైకాపా సుప్రీం కోర్టుకు వెళ్ళింది. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. అత్యవసరమైన వాటినే విచారిస్తామని సుప్రీం కోర్టు ముందుగానే ప్రకటించింది. ఏపీ దాఖలు చేసిన పిటిషన్ ఎన్నికలకు సంబంధించిన పిటిషన్ కావడంతో దీనిని ఈరోజు విచారించబోతున్నది. ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు ఎంతవరకు జోక్యం చేసుకుంటుంది. అనుకున్నట్టుగానే ఎన్నికలను ఏపీ లో నిర్వహిస్తారా? లేదా అన్నది ఈరోజు తేలిపోతుంది.
592507 175869I like this internet site so a lot, bookmarked . 577820