రాజధాని అమరావతి సమీప భవిష్యత్తులో ‘గతించిన చరిత్ర’ కాబోతోంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అలాగని, అక్కడ మళ్ళీ వ్యవసాయం తప్పదనుకుంటే పొరపాటే. అటు వ్యవసాయానికీ, ఇటు అభివృద్ధికీ నోచుకోకుండా పోనుంది అమరావతి. అయితే, విజయవాడ – గుంటూరు నగరాల మధ్య వున్న ప్రాంతం కావడంతో, అమరావతిలో ఎంతో కొంత అభివృద్ధి ఎప్పటికో ఒకప్పటికి కన్పిస్తుంది. ‘బిచ్చం’ వేసినట్లు కొన్ని విద్యా సంస్థలో, ఇంకొకటో ఏర్పాటు చేసేయనుంది వైఎస్ జగన్ సర్కార్.
విశాఖపట్నం, రాజధానిగా ఎంతటి ‘కొత్త’ అభివృద్ధిని చూడబోతోందన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే, అక్కడైనా.. అభివృద్ధి కోసం వేల కోట్లు ఖర్చు చేయాల్సిందే.. వేరే దారి లేదు. అంత ఆర్థిక శక్తీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. కర్నూలులో హైకోర్టుని ఏర్పాటు చేయడం ఖాయంగానే కన్పిస్తోంది. అయితే, దీనికి కేంద్రం అనుమతి కావాలి. విశాఖ పరిస్థితీ అంతే. అవన్నీ ఇప్పటికిప్పుడు అయిపోతాయని అనుకోలేం.
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖ మాత్రం.. అతి త్వరలోనే అందుబాటులోకి వస్తుంది.. అద్దె భవనాల్లో కార్యాలయాలూ షురూ అవుతాయి. ఇంతకీ, రాయలసీమ పరిస్థితేంటి.? ఎప్పుడో మద్రాస్ రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా వుండేది. ఆ కర్నూలుని రాజధాని చేయాలన్న డిమాండ్ సీమ వాసుల్లో విన్పిస్తోంది. కర్నూలు మాత్రమే కాదు, రాష్ట్రంలో ఏ నగరమైనా అభివృద్ధి చెందాల్సిందే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అన్నట్లు ఆంధ్రప్రదేశ్కి చాలా నగరాలున్నాయి.. అంతకు మించిన సమస్యలున్నాయి.
చిత్తూరు జిల్లాలో తిరుపతి, కడప జిల్లాలో కడప, అనంతపురం జిల్లాలో అనంతపురం.. ఇలా ప్రతి జిల్లా రాజధానీ అభివృద్ధి చెందాలి. ద్వితీయ శ్రేణి నగరాలూ అభివృద్ధి చెంది తీరాల్సిందే. మాటలు చెప్పడం సులభమే.. కానీ, చిత్తశుద్ధి లేని రాజకీయాల్లో ఏదీ అంత సులభం కానే కాదు. శ్రీశైలం నీటి విషయంలో భంగపడ్డాం.. అని రాయలసీమ వాసులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి అది దశాబ్దాల ఆవేదన. ఇప్పుడు ఇంకాస్త గట్టిగా విన్పిస్తోందంతే. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, రాయలసీమకు న్యాయం చేయాల్సిన అవసరం వుంది. కానీ, ఇక్కడ సమస్య ఏంటంటే.. కృష్ణా – గుంటూరు జిల్లాలు తమ నీటిని లాక్కుపోతున్నాయని సీమ నేతలు చెబుతున్నారు.
రాజకీయాల్లో అన్ని పదవులూ అనుభవించి, ఇప్పుడు తీరిగ్గా సీమ హక్కుల గురించి పోరాడుతున్నారు నేతలు. సీమ వెనుకాబుటతనానికి అయినా, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి అయినా, ప్రకాశం – గుంటూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాల వెనుకాబటుతనానికి అయినా.. రాజకీయ నాయకులే బాధ్యత వహించాలి. అన్ని పార్టీలకూ ఈ పాపంలో భాగముంది. సీమ మీద అంత ప్రేమ వైఎస్ జగన్కి వుంటే, ఆ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ లేదో సీమకి.. అదే కర్నూలుకి ఇవ్వొచ్చు కదా.!
777827 172518extremely nice post, i undoubtedly adore this incredible website, carry on it 821952
344220 196131Pretty section of content material. I just stumbled upon your weblog and in accession capital to assert that I get in fact enjoyed account your weblog posts. Any way I will be subscribing to your augment and even I achievement you access consistently rapidly. 640857
317326 441899This internet internet site is my breathing in, extremely excellent layout and perfect content material material . 411753
597832 220631This kind of lovely blog youve, glad I found it!?? 848738
653354 101479I like this website very considerably, Its a extremely nice position to read and receive information . 719417