పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల లోపు వీలైనన్ని ఎక్కువ సినిమాలు చేద్దామని ఫిక్స్ అయ్యాడు. అందుకనే తనకు రీమేక్ అయితే ఎక్కువ సమయం పట్టదని భావించి పింక్ రీమేక్ వకీల్ సాబ్ ను ముందు పట్టాలెక్కించాడు.
అదే ఊపులో హరీష్ శంకర్ ప్రాజెక్ట్, క్రిష్ పీరియాడిక్ డ్రామాను పట్టాలెక్కించాడు. వకీల్ సాబ్ షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తయింది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో పీరియడిక్ డ్రామా చేయడం సులువు కాదని గ్రహించిన పవన్ ఇప్పుడు ఒక రీమేక్ పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ కొనుగోలు చేసిన విషయం తెల్సిందే. గత కొన్ని నెలల నుండి ఈ సినిమాపై వార్తలు వస్తున్నాయి. రవితేజ, రానా దగ్గుబాటి హీరోలుగా చేస్తారని ప్రచారం జరుగుతోంది.
ఇప్పుడు ఈ సినిమా విషయంలోనే పవన్ ఆసక్తిగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ డిస్కషన్స్ మధ్య ఈ రీమేక్ టాపిక్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. తనకు సమయం తక్కువ ఉండడంతో రీమేక్స్ అయితే ఫాస్ట్ గా కంప్లీట్ చేయొచ్చు కాబట్టి పవన్ ఆవైపుగా ఆలోచిస్తున్నాడు. ఏదేమైనా ఈ సినిమాపై మరింత క్లారిటీ రావాలంటే మరికొంత కాలం ఆగకతప్పదు.
823719 22862A blog like yours ought to be earning considerably funds from adsense.~::- 237416
625592 564008Hey there! Excellent stuff, do maintain us posted when you lastly post something like that! 81236