గతంలో రాజధాని విషయంలో రైతుల వద్ద నుంచి భూములు తీసుకునే విషయంలో రైతుల నుంచి ఆందోళనలు వచ్చిన సమయంలో పవన్ కళ్యాణ్ అక్కడి రైతులతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఆ తరువాత రాజధాని ప్రాంత రైతుల సమస్యలు తెలుసుకొని అప్పటి ప్రభుత్వానికి వాటిని తెలియజేసి వారి సమస్యలు ఒక కొలిక్కి వచ్చేలా చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అన్ని అనుకున్నట్టుగా జరిగాయి.
రాజధాని నిర్మాణం ఆలస్యం కావడంతో అక్కడ కొంతమేర మాత్రమే నిర్మాణాలు మాత్రమే జరిగాయి. లక్షాఐదువేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ప్రాధమికంగా అంచనా వేశారు. రాజధానిని ప్రపంచంలోనే గొప్ప రాజధానిలో ఒకటిగా నిలబెట్టాలని అనుకున్నారు. కానీ, అనుకున్నది ఒకటి అక్కడి జరిగింది మరొకటి అయ్యింది. కనీసం ఓ ముప్పై లేదా నలభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొంతమేర రాజధానిని అభివృద్ధి చేసి ఉంటె ఇప్పుడు వేరుగా ఉండేది.
వైకాపా ఈ మూడు రాజధానుల నిర్ణయం తీసుకునే విషయంలో ఆలోచన చేసేది. కానీ, గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల కారణంగా వైకాపా ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నా దాని ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సమర్ధవంతంగా వ్యతిరేకించలేకపోతున్నది. కారణం అటు వైజాగ్ ప్రజలు, ఇటు రాయలసీమ ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీకి కావాలి. ఈ విషయంపై జనసేన పార్టీ కూడా కొంత ఆలోచన ధోరణిలో ఉన్నది. ఈనెల 27 న మంత్రివర్గ సమావేశంలో జీఎన్ రావు కమిటీ నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు.
రాజధాని అభివృద్ధి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అన్నది తెలియాల్సి ఉన్నది. రాజధాని అంటే బిల్డింగ్ లు మాత్రమే కాదని, అభివృద్ధి అని, మూడు రాజధానుల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు అన్నది ప్రభుత్వం తెలియజేసిన తరువాత దానిపై జనసేన పార్టీ ఓ నిర్ణయం తీసుకుంటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏదైనా ఈనెల 27 వ తేదీన దీనిపై ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నది. మరి ఆరోజున ఏం జరుగుతుందో చూడాలి.
221820 863970You created some decent points there. I looked on the net for any concern and discovered most individuals goes in addition to with all your web site. 470768