మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న ఆచార్య మూవీ ముగియడమే ఆలస్యం వెంటనే తమిళ వేదాళంను రీమేక్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. వచ్చే జనవరిలోనే ఈ రీమేక్ పట్టాలెక్కబోతుంది.. ఆతర్వాత లూసీఫర్ రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. కాని అనూహ్యంగా వచ్చే నెల నుండి లూసీఫర్ రీమేక్ పట్టాలెక్కబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది. దాంతో వేదాళం పరిస్థితి ఏంటీ అంటూ మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. బిగ్ బాస్ ఫినాలే స్టేజీపై వేదాళం రీమేక్ కు సంబంధించి చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశాడు.
వేదాళం రీమేక్ ను వచ్చే ఏడు ఎనిమిది నెలల్లో ప్రారంభం చేసే అవకాశం ఉందన్నట్లుగా ఆయన మాట్లాడారు. వేదాళం ఆలస్యంకు కారణం స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు అంటూ వార్తలు వస్తున్నాయి. చిరంజీవి స్వయంగా ఆ మార్పులు చెప్పారని తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వేదాళం రీమేక్ కోసం ఇప్పటికే రెడీ చేసిన స్క్రిప్ట్ ను దర్శకుడు మెహర్ రమేష్ మార్చుతున్నాడట. అందుకే ఆలస్యం అవుతుందని అంటున్నారు. త్వరలోనే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేసి మళ్లీ చిరంజీవికి వినిపించే అవకాశం ఉందంటున్నారు.
605755 489215Heya! I just wanted to ask if you ever have any problems with hackers? My last blog (wordpress) was hacked and I ended up losing a few months of hard work due to no backup. Do you have any solutions to protect against hackers? 36543
146818 91585Some truly nice stuff on this website , I it. 853771
249326 664130Thanks for blogging and i enjoy the blog posting so no public comments.,,,,,,,,,,, 449538