ఆయనపేరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం. ఎవరిని, ఎప్పుడు, ఎందుకు తిడతాడో కూడా తెలియదు. ఆయన చేతికి మైక్ ఇస్తే చాలు.. జనాలు బూతులు వినలేక పారిపోతున్నారు. మైక్ చేతిలో లేకుంటే.. ఎక్కడ కొడతాడోనని వణికిపోతున్నారు. మైక్ లేనప్పుడు సన్నిహితులు తప్ప వేరేవాళ్లు ఆయన చుట్టుపక్కలకు వెళ్లేందుకు కూడా జంకుతున్నారు. ఆయనే.. నందమూరి నటసింహం బాలయ్యబాబు గురించిన బ్రీఫ్ ఇంట్రొడక్షన్ మాత్రమే. ఆయన గురించి చెప్పుకుంటూ పోతే.. తెలుగు సీరియల్స్ రికార్డును కూడా బాలయ్య జీవిత చరిత్ర బద్దలు కొట్టేస్తుందనడంలో సందేహం లేదు. అసలే బాలయ్యంటే ఆయన్ను దగ్గర్నుంచి చూసిన అభిమానులు భయం. కానీ ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ప్రజలు కూడా బాలయ్య ప్రచారవాహనం వస్తోందంటే భయపడి పారిపోతున్నారు. ఎందుకని ఆరాతీస్తే.. ఎదురుగా వెళ్లి మరీ తన్నించుకోవాలా? తిట్టించుకోవాలా? అని ఎదురుప్రశ్నలు వేసే పరిస్థితి తలెత్తింది. కానీ ఆయన శ్రీమతి మాత్రం బాలయ్య చర్యలను సమర్థిస్తున్నారు.
ప్రచారంలో ప్రతిరోజూ నోటి దురుసుతో బాలయ్య బాబు వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ యూట్యూబ్ చానల్ కెమెరామెన్ ని కొట్టారు. హిందూపూర్ నియోజకవర్గంలో సిరిపురం చెరువుకు నీరు విడుదల చేయాలని కోరిన టీడీపీ కార్యకర్త రవికుమార్ ను కొట్టడంతో ఆయన క్షణం ఆలస్యం చేయకుండా వైయస్సార్ కాంగ్రెస్లో చేరిపోయారు. ప్రచారంలో పెళ్లాం పక్కనుందనే విషయాన్ని మరిచిపోయి మరీ పీకకోస్తా.. నా కొడకా.. నీ అడ్రస్ చెప్పు గెలవకపోతే నీ అంతుచూస్తా అని అభిమానులకు వార్నింగ్ లు ఇస్తున్నారు. మోదీ, జగన్ లపై అయితే.. మరీ దారుణమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు.
రాజకీయ పక్షాలపై దుమ్మెత్తిపోయడం సహజమే అనుకుందాం.. మరి అభిమానులు, పార్టీ కార్యకర్తలపై ఈ ఉన్మాదమేంటని బాలయ్య భార్య వసుంధను అడిగితే.. ఆమె ఇచ్చిన సమాధానం మరింత ‘సంభ్రమాశ్చర్యాల’కు గురిచేసింది. అభిమానులును ఇష్టమొచ్చినట్లు కొట్టడం సరైనదేనా అని ప్రశ్నిస్తే.. ‘అభిమానులతో ఉన్న చనువు వల్లే మనవాళ్లు అనుకుని ఆయన అలా ప్రవర్తిస్తారు’ అని వసుంధర తెలిపారు. తన్నించుకున్నా.. బాలయ్య ప్రవర్తనను అభిమానులు సానుకూలంగానే తీసుకుంటారని ఆమె చెప్పారు. ‘అభిమానులు కూడా బాలకృష్ణ గారు ప్రవర్తన గురించి ఏమీ అనుకోరు. ఇలా చేయడంపై వాళ్లు కూడా సంతోషంగానే ఉంటారు’ అంటూ వసుంధర వ్యాఖ్యానించారు. అయితే బాలయ్య అంటే గిట్టని వాళ్లు ఆయన ప్రవర్తనను మరో రకంగా హైలెట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తుంటారని ఆమె మండిపడ్డారు.
పేదలకోసం బాలయ్య ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారని వసుంధర పేర్కొన్నారు. ‘పేదలు కష్టాల్లో ఉంటే బాలకృష్ణ గారు తట్టుకోలేరు. అందుకు ఉదాహరణ బసవతారకం ఆసుపత్రి. ఈ ఆసుపత్రికి హిందూపురం నుంచి గానీ, అభిమానులు గానీ, పేదవారు గానీ.. ఎవరొచ్చినా.. ఎవరికీ ట్రిట్మెంట్ నిరాకరించరు’ అని వసుంధర దేవి చెప్పుకొచ్చారు. బసవతారకం ఆసుపత్రి నిర్వహణకోసం నిధుల సేకరణ కోసం దేశవిదేశాల్లో పర్యటిస్తున్నారని.. ఆయనలోని మంచికోణాలకు ఎవరూ అర్థంచేసుకోవడం లేదని వసుంధర అన్నారు.
ఇన్ని మంచిపనులు చేస్తున్న బాలయ్య.. ప్రజాజీవితంలోకి రాగానే అలా ఎందుకు ప్రవర్తిస్తారనేదే ఎవరికీ అర్థంకాని పరిస్థితి. అదో మానసిక సమస్యా.. లేక ఇలా వ్యవహరించడమే హీరోయిజమా? అనేది మాత్రం ఈ విచిత్రాన్ని కళ్లారా చూస్తున్న ప్రజలకు అర్థం కావడం లేదు.
817116 605808Id should verify with you here. Which isnt something I often do! I enjoy studying a publish that can make people feel. Also, thanks for permitting me to remark! 822790