కరోనా కకావికలం చేయడం అల్లకల్లోలంలో ముగినిగపోయిన భారత్ కు ప్రపంచ దేశాలు బాసటగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా నుంచి భారీగానే సాయం అందింది. కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన జో బైడెన్ తన వంతుగా మనకు అండగా నిలిచారు. ఆయన ప్రకటించిన వంద మిలియన్ డాలర్ల ప్యాకేజీతో కలిసి ఇప్పటివరకు అమెరికా నుంచి మనకు రూ.3,671 కోట్ల మేర సాయం అందింది.
భారత్ లో పరిస్థితులు చూసి అగ్రరాజ్యంలోని పలు టెక్, ఫార్మా కంపెనీలు, స్వచ్చంద సంస్థలు అండగా నిలిచాయి. గూగుల్ సంస్థ రూ.135 కోట్ల సాయం అందించగా.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తీవ్రంగా కలత చెంది.. అవసరమైన సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు. అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ కూడా మనకు అండగా నిలిచింది. దాదాపు రూ.510 కోట్ల విలువైన ఔషధాలను అందిస్తామని పేర్కొంది.
అలాగే అమెరికాలోని 40కి పైగా కార్పొరేట్ సంస్థలు ఒక టాస్క్ ఫోర్స్ గా ఏర్పడి భారత్ కు 30 మిలియన్ డాలర్ల సాయం అందించాయి. డెలాయిట్ సంస్థ భారత్ కు 12వేల ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. ఇలా ఇప్పటివరకు అమెరికా నుంచి దాదాపు అర బిలియన్ డాలర్ల సాయం అందింది. త్వరలోనే ఇది బిలియన్ డాలర్ల వరకు చేరే అవకాశం ఉందని అంచనా.
912503 716527hi!,I really like your writing very much! 167760
911752 596929I real delighted to uncover this website on bing, just what I was searching for : D also bookmarked . 418101