Upasana: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) కి పద్మవిభూషణ్ (Padma Vibhushan) పురస్కారం ప్రకటించడం తెలుగు ప్రజల్లో సంతోషాన్ని కలిగించింది. అయితే.. దేశంలో మరే కుటుంబంలోనూ జరగని అద్భుతం మెగా ఫ్యామిలీలో జరిగింది. 140కోట్ల భారత జనాభాలో 336 మందికి ఈ రెండో అత్యున్నత పురస్కారం లభించగా.. వారిలో ఇద్దరు ఒకే కుటుంబంలో ఉండటం విశేషం. మా కుటుంబంలో రెండు పద్మవిభూషణ్ అవార్డులు ఉండటం.. మాకెంతో గర్వకారణమని మెగా కోడలు ఉపాసన (Upasana) చేసిన పోస్ట్ ఆసక్తి రేపుతోంది.
‘సినిమా, దాతృత్వంలోనే కాకుండా జీవితంలో తండ్రి, మామగారు, తాతగా మాకు స్ఫూర్తి నింపారు. ఇప్పుడు మా కుటుంబంలో రెండు పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలుగా తాత డాక్టర్ ప్రతాప్ సి.రెడ్డి, మామగారు చిరంజీవిగారు ఉండటం మాకెంతో గౌరవం. వారి ఆశీర్వాదాలు మాకెప్పుడూ ఉండాల’ని పోస్ట్ చేశారు. నిజంగా ఇది అద్భుతమైన విషయమని నెట్టింట వీరిని ప్రశంసిస్తున్నారు.
ఉపాసన తాతగారు ప్రతాప్ సి.రెడ్డి అపోలో అధినేతగా దేశవ్యాప్తంగా ఆసుపత్రుల నిర్వహణ ద్వారా వైద్య రంగంలో విశేష సేవలు అందిస్తున్నారు. ఇటు చిరంజీవి కళారంగానికి విశేషమైన సేవలు చేశారు.