Switch to English

ఉద్ధవ్ ఠాక్రే.. జగన్ ఫార్ములా ఫాలో అయిపోదాం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై కేసులతో కక్ష సాధించడం ఇటీవల కాలంలో సాధారణమైపోయింది. ఏదో ఒక విధంగా ప్రత్యర్థులను ఇరికించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీయడానికి నడుం కట్టారు.

తెలుగుదేశం హయాంలో ఏమైనా అవకతవకలు జరిగాయో లేదో తెలుసుకునేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా ఏమీ తేల్చలేకపోయారు. దీనిపై టీడీపీ నుంచి సెటైర్లు కూడా వెల్లువెత్తాయి.

ఏపీలో పరిస్థితి ఇలా ఉండగా.. కొత్తగా మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా జగన్ బాటలోనే సాగుతున్నారు. పగ్గాలు చేపట్టిన వెంటనే ఫడ్నవిస్ సర్కారు చేపట్టిన పనులపై దృష్టి సారించారు. అచ్చం జగన్ చేసినట్టే.. ఎన్నికలకు ఆరు నెలల ముందు చేపట్టిన పనులన్నీ వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాజెక్టుపై సమీక్షలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.

ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఇది కాకుండా దాదాపు 70వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ఠాక్రే వచ్చిన వెంటనే పెండింగ్ లో పెట్టారు. వీటన్నింటిపై సమీక్షలు జరిపి.. ఏది అవసరం? ఎంత అవసరం అనే అంశాల ప్రాతిపదికనే నిర్ణయం తీసుకుంటామని శివసేన వర్గాలు చెబుతున్నాయి.

త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఠాక్రే శ్వేతపత్రం విడుదల చేస్తారని వెల్లడించాయి. నిన్నటి వరకు బీజేపీతో కలిసి ఉన్న శివసేన.. ఇప్పుడు అదే బీజేపీతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఏ విషయాన్నీ అంత తేలిగ్గా వదిలిపెట్టని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. మహారాష్ట్ర విషయంలో ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో అని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...