అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై కేసులతో కక్ష సాధించడం ఇటీవల కాలంలో సాధారణమైపోయింది. ఏదో ఒక విధంగా ప్రత్యర్థులను ఇరికించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ప్రభుత్వ అవినీతిని వెలికి తీయడానికి నడుం కట్టారు.
తెలుగుదేశం హయాంలో ఏమైనా అవకతవకలు జరిగాయో లేదో తెలుసుకునేందుకు మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి ఆరు వారాల్లో నివేదిక ఇవ్వాలని కోరారు. అయితే, ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలైనా ఏమీ తేల్చలేకపోయారు. దీనిపై టీడీపీ నుంచి సెటైర్లు కూడా వెల్లువెత్తాయి.
ఏపీలో పరిస్థితి ఇలా ఉండగా.. కొత్తగా మహారాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే కూడా జగన్ బాటలోనే సాగుతున్నారు. పగ్గాలు చేపట్టిన వెంటనే ఫడ్నవిస్ సర్కారు చేపట్టిన పనులపై దృష్టి సారించారు. అచ్చం జగన్ చేసినట్టే.. ఎన్నికలకు ఆరు నెలల ముందు చేపట్టిన పనులన్నీ వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాజెక్టుపై సమీక్షలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు.
ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. ఇది కాకుండా దాదాపు 70వేల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ఠాక్రే వచ్చిన వెంటనే పెండింగ్ లో పెట్టారు. వీటన్నింటిపై సమీక్షలు జరిపి.. ఏది అవసరం? ఎంత అవసరం అనే అంశాల ప్రాతిపదికనే నిర్ణయం తీసుకుంటామని శివసేన వర్గాలు చెబుతున్నాయి.
త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఠాక్రే శ్వేతపత్రం విడుదల చేస్తారని వెల్లడించాయి. నిన్నటి వరకు బీజేపీతో కలిసి ఉన్న శివసేన.. ఇప్పుడు అదే బీజేపీతో ఢీ అంటే ఢీ అనే రీతిలో తలపడుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. ఏ విషయాన్నీ అంత తేలిగ్గా వదిలిపెట్టని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. మహారాష్ట్ర విషయంలో ఎలాంటి వ్యూహాలు పన్నుతున్నారో అని రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది.
887413 602302 You made some decent points there. I looked on the internet for the problem and discovered most individuals will go along with with your internet site. 931725
575806 489706Can you give me some suggestions for piece of software writing? 767675
361985 640650I like your writing style truly loving this web site . 478361