కేంద్ర ప్రభుత్వం ఈనెల 8వ తారీకు నుండి ప్రార్థన మందిరాల్లోకి భక్తులను అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల అనుసారంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోకి కూడా భక్తులను అనుమతించబోతున్నట్లుగా టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బోర్డు సమావేశం ఏర్పాటు చేసి దర్శనంకు సంబంధించిన మార్గదర్శకాలను మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సుబ్బారెడ్డి చర్చించారు.
శ్రీవారి దర్శనంకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అలిపిరి గేట్ వద్దే ధర్మల్ స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి పైకి పంపిస్తాం. కొండపైకి వెళ్లిన వారిలో కూడా ర్యాండమ్గా కొందరికి టెస్టులు నిర్వహించాలని నిర్ణయించాం. ప్రతి ఒక్కరు కూడా ముందుగానే దర్శనంకు రిజిస్ట్రర్ చేయించుకోవాలి. కరోనా పాజిటివ్ కేసులతో కాంటాక్ట్ అయ్యి ఉండటం లేదంటే కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న వారికి దర్శనం లేదు. అలిపిరి వద్దే వారిని అడ్డుకుంటామని సుబ్బారెడ్డి అన్నారు.
భక్తులు హుండీ తాకకుండా ఉండేలా జాగ్రత్తలు పడటంతో పాటు ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇక ఈనెల 8 నుండి ఆన్ లైన్ తిరుపతి లడ్డులను ఆపేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మొదటి రెండు రోజులు స్థానికులు మరియు టీటీటీ ఉద్యోగులకు దర్శనం కల్పించి 11వ తారీకు నుండి ఇతర భక్తులకు ఛాన్స్ ఇవ్వబోతున్నాం.
266638 260478Wow that was strange. I just wrote an incredibly long comment but soon after I clicked submit my comment didnt appear. Grrrr properly Im not writing all that more than once again. Regardless, just wanted to say fantastic blog! 813620