Switch to English

డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌కి క్లీన్‌ చిట్‌ వచ్చినట్లే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

88,946FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు డ్రగ్స్‌ ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వెల్లువెత్తాయి. ఓ సినీ ప్రముఖుడి సోదరుడు పలుమార్లు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన విషయం విదితమే. ఓ దర్శకుడిపైనా, ఓ ఎనర్జిటిక్‌ హీరోయిన్‌పైనా, ఓ యంగ్‌ హీరోపైనా, ఓ హాట్‌ నటిపైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలామందిపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో కొందరపై డ్రగ్స్‌ అడిక్స్‌ అని ఆరోపణలు వస్తే, మరికొందరిపై ‘డ్రగ్స్‌ పెడ్లర్స్‌’ అనే ఆరోపణలు విన్పించాయి. ‘సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారు..’ అంటూ ఆయా సందర్భాల్లో డ్రగ్స్‌ వాడేవారి సినీ ప్రముఖులపై కొందరు సినీ ప్రముఖులు పెదవి విరిచారు కూడా.

అయితే, టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఎక్సయిజ్‌ శాఖ తరఫున ప్రత్యేకంగా ‘సిట్‌’ ఏర్పాటు చేసి మరీ, విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో 12 మంది సినీ ప్రముఖులు ‘సిట్‌’ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. అయితే, ఇది రెండేళ్ళ క్రితం నాటి వ్యవహారం. ఆ తర్వాత అది సద్దుమణిగింది కూడా. మళ్ళీ ఇప్పుడు ఈ అంశానికి మీడియాలో ప్రాధాన్యత దక్కడానికి కారణమూ లేకపోలేదు. అసలు ఆ కేసులో ఎవర్ని అరెస్టు చేశారు.? ఎవర్ని నిందితులుగా చూపారు? ఎవర్ని తప్పించారు.? అన్న విషయమై ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ దృష్టి సారించింది.

సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసిన విషయమేంటంటే, ఆ 12 మంది సినీ ప్రముఖులకీ క్లీన్‌ చిట్‌ లభించిందని. అయితే, ఈ విషయమై అధికారుల వెర్షన్‌ ఇంకోలా విన్పిస్తోంది. 4 చార్జిషీట్లను కోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వేశామనీ, కేసు విచారణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదనీ, మరిన్ని చార్జి షీట్లు వేయాల్సి వుందని అంటున్నారు అధికారులు. సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయిన విషయాల ప్రకారం 12 మంది సినీ సెలబ్రిటీలకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది నిజమేనా.? అన్నదానిపై మాత్రం అధికారులు స్పష్టమైన సమాచారమివ్వడంలేదు.

దర్శకుడు పూరి జగన్నాథ్‌, హీరో రవితేజ, యంగ్‌ హీరో తరుణ్‌, నటి ఛార్మి, మరో నటి ముమైత్‌ఖాన్‌.. ఇలా 12 మంది సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. వారిలో కొందరు విచారణాధికారుల కోరిన మేరకు ‘శాంపిల్స్‌’ ఇచ్చారు. హెయిర్‌, నెయిల్స్‌, బ్లడ్‌.. ఇలా పలు శాంపిల్స్‌ని అధికారులు తీసుకుని, పరీక్షలు నిర్వహించినా, వాటి వివరాలు మాత్రం బయటకు పొక్కలేదు. కొందరు శాంపిల్స్‌ ఇవ్వడానికి నిరాకరించారనుకోండి, అది వేరే విషయం.

‘మాకు ఈ కేసుతో సంబంధం లేదు, మేం విచారణకు సహకరిస్తాం, క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తాం’ అని దాదాపు అందరూ నమ్మకం వ్యక్తం చేశారు విచారణ సమయంలో. అన్న మాట ప్రకారమే దాదాపుగా అందరికీ క్లీన్‌ చిట్‌ వచ్చినట్లే కన్పిస్తోంది. మరోపక్క, పై పన్నెండు మందిలో కొందరు డ్రగ్స్‌ విషయంలో బాధితులుగా వున్నట్లు పోలీసులు చార్జి షీట్‌లో పేర్కొన్నారనే వార్తలూ బయటకు పొక్కుతున్నాయి. అయితే, పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కావడంలేదు.

7 COMMENTS

సినిమా

సంక్రాంతికి శర్వా “నారి నారి నడుమ మురారి” సందడి

చార్మింగ్ స్టార్ శర్వానంద్ నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ నారి నారి నడుమ మురారి పెద్ద సినిమాల సరసన 2026 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకులను...

అఖండ 2 రిలీజ్ వాయిదా – కొత్త తేదీ త్వరలో: నిర్మాతల...

అఖండ 2 కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాతలు నిన్న రాత్రి లేట్‌గా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను వెల్లడించారు. సినిమా విడుదల కోసం టీమ్...

BIGG BOSS 9 TELUGU E90: తొలి ఫైనలిస్ట్ గా కల్యాణ్...

బిగ్ బాస్ సీజన్ 9 శుక్రవారం ప్రసారమైన 90వ ఎపిసోడ్ నిజంగా మసాలా, ఎమోషన్, హీట్‌ అన్నీ కలగలసిన రోలర్ కోస్టర్ లాంటిది. మొదటి ఫైనలిస్ట్...

అసలు “ఎరోస్–14 రీల్స్” వివాదం, అప్పుల కథ ఏమిటి ?

టాలీవుడ్‌లో ఎరోస్ ఇంటర్నేషనల్ మరియు 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ మధ్య నడుస్తున్న ఆర్థిక వివాదం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాదానికి మూలం మహేష్...

CHIRANJEEVI: లుక్స్, స్టయిల్ తో రఫ్పాడేస్తున్న మెగాస్టార్

CHIRANJEEVI: మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరు. కొత్తగా చెప్పక్కర్లేని ఘనతలు. తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని సరికొత్త కోణంలో అందించిన సినీ రారాజు. 47 ఏళ్ల...

రాజకీయం

చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీ కి సహకరించిన నారా భువనేశ్వరి

హైదరాబాద్ నుంచి జంగారెడ్డిగూడెంకు ప్రయాణిస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని నాయికన్ గూడెం చెక్ పోస్ట్ వద్ద జరిగిన ఒక చిన్న సంఘటన ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...

ప్రతిపక్ష హోదా అడగడం కన్నా జగన్.. అసెంబ్లీకి రావాలి: తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హితవు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుతో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం కీలకంగా భేటీ అయ్యారు. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పరస్పర సహకారం,...

ఏపీ లిక్కర్ స్కాం: నిందితులకు ఏసీబీ కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు ఏసీబీ కోర్టు భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది. ఈ కేసులో అరెస్టయిన నిందితులు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వెంకటేష్ నాయుడు, నవీన్ కృష్ణ, బాలాజీ యాదవ్ దాఖలు చేసిన...

పిల్లలను దేశానికి ఉపయోగ పడేలా తీర్చిదిద్దాలి: పవన్ కల్యాణ్

చిలకలూరిపేట శారదా జడ్పీ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్‌లో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విద్యార్థుల భవిష్యత్‌పై కీలక సూచనలు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య అనుబంధం ఎంత బలంగా ఉంటే...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: డిసెంబర్ 6, 2025 శనివారం రాశిఫలాలు

మేషం (Aries): ఈ రోజు మీరు పనుల్లో చురుకుగా ఉంటారు. కుటుంబ సభ్యుల మాటల్లో నమ్మకం పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో చిన్న లాభం కనిపిస్తుంది. స్నేహితులతో కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం కొంత...

మెగాస్టార్ గ్రేస్ తో ‘శశిరేఖ’ సాంగ్ త్వరలో..

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంలో ఉన్న ‘శశిరేఖ’ పాట త్వరలో విడుదల కానుంది. కేరళలో అందమైన లొకేషన్లలో షూట్ చేసిన ఈ సాంగ్‌లో చిరు ఎంతో గ్రేస్‌తో, క్లాస్‌గా...

“పార్టీ శాశ్వతం… కార్యకర్తలే శక్తి!” – పాలకొండలో లోకేష్ సందేశం

పాలకొండలో నిర్వహించిన టిడిపి కార్యకర్తల సమావేశంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కార్యకర్తలకు ఉత్సాహాన్నిచ్చే సందేశం ఇచ్చారు. తెలుగుదేశంలో వ్యక్తులు శాశ్వతం కాదని, పార్టీ మాత్రమే శాశ్వతమని ఆయన స్పష్టం...

హైదరాబాద్‌కి కొరియన్ దర్శకుడు యూ ఇన్-షిక్… ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం సినిమాలు చేసే ఆలోచన

న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్‌ కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌ బంజారాహిల్స్‌లోని ఎల్‌.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో...

ఏపీ మంత్రి నారా లోకేష్‌పై రీటైర్డ్ ఐపీఎస్ పస లేని ఆరోపణలు!

ఆయన పేరు ఎం నాగేశ్వరరావు. గతంలో ఆయన సీబీఐ డైరెక్టర్‌గా కూడా పని చేశారు. ప్రస్తుతం రిటైర్డ్ ఐపీఎస్ మాత్రమే.! సోషల్ మీడియా వేదికగా యాక్టివ్‌గా వుంటుంటారు, చాలా అంశాలపై తన అభిప్రాయాల్ని...