Switch to English

డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌కి క్లీన్‌ చిట్‌ వచ్చినట్లే.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు డ్రగ్స్‌ ఆరోపణలు కుప్పలు తెప్పలుగా వెల్లువెత్తాయి. ఓ సినీ ప్రముఖుడి సోదరుడు పలుమార్లు డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ అయిన విషయం విదితమే. ఓ దర్శకుడిపైనా, ఓ ఎనర్జిటిక్‌ హీరోయిన్‌పైనా, ఓ యంగ్‌ హీరోపైనా, ఓ హాట్‌ నటిపైనా.. ఇలా చెప్పుకుంటూ పోతే, చాలామందిపై ఆరోపణలు వచ్చాయి. వీరిలో కొందరపై డ్రగ్స్‌ అడిక్స్‌ అని ఆరోపణలు వస్తే, మరికొందరిపై ‘డ్రగ్స్‌ పెడ్లర్స్‌’ అనే ఆరోపణలు విన్పించాయి. ‘సినీ పరిశ్రమ పరువు తీస్తున్నారు..’ అంటూ ఆయా సందర్భాల్లో డ్రగ్స్‌ వాడేవారి సినీ ప్రముఖులపై కొందరు సినీ ప్రముఖులు పెదవి విరిచారు కూడా.

అయితే, టాలీవుడ్‌లో డ్రగ్స్‌ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, ఎక్సయిజ్‌ శాఖ తరఫున ప్రత్యేకంగా ‘సిట్‌’ ఏర్పాటు చేసి మరీ, విచారణను వేగవంతం చేసింది. ఈ క్రమంలో 12 మంది సినీ ప్రముఖులు ‘సిట్‌’ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. అయితే, ఇది రెండేళ్ళ క్రితం నాటి వ్యవహారం. ఆ తర్వాత అది సద్దుమణిగింది కూడా. మళ్ళీ ఇప్పుడు ఈ అంశానికి మీడియాలో ప్రాధాన్యత దక్కడానికి కారణమూ లేకపోలేదు. అసలు ఆ కేసులో ఎవర్ని అరెస్టు చేశారు.? ఎవర్ని నిందితులుగా చూపారు? ఎవర్ని తప్పించారు.? అన్న విషయమై ఫోరమ్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ దృష్టి సారించింది.

సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసిన విషయమేంటంటే, ఆ 12 మంది సినీ ప్రముఖులకీ క్లీన్‌ చిట్‌ లభించిందని. అయితే, ఈ విషయమై అధికారుల వెర్షన్‌ ఇంకోలా విన్పిస్తోంది. 4 చార్జిషీట్లను కోర్టులో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి వేశామనీ, కేసు విచారణలో ఎలాంటి అలసత్వం ప్రదర్శించలేదనీ, మరిన్ని చార్జి షీట్లు వేయాల్సి వుందని అంటున్నారు అధికారులు. సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడయిన విషయాల ప్రకారం 12 మంది సినీ సెలబ్రిటీలకు క్లీన్‌ చిట్‌ ఇచ్చింది నిజమేనా.? అన్నదానిపై మాత్రం అధికారులు స్పష్టమైన సమాచారమివ్వడంలేదు.

దర్శకుడు పూరి జగన్నాథ్‌, హీరో రవితేజ, యంగ్‌ హీరో తరుణ్‌, నటి ఛార్మి, మరో నటి ముమైత్‌ఖాన్‌.. ఇలా 12 మంది సినీ ప్రముఖులు విచారణకు హాజరయ్యారు. వారిలో కొందరు విచారణాధికారుల కోరిన మేరకు ‘శాంపిల్స్‌’ ఇచ్చారు. హెయిర్‌, నెయిల్స్‌, బ్లడ్‌.. ఇలా పలు శాంపిల్స్‌ని అధికారులు తీసుకుని, పరీక్షలు నిర్వహించినా, వాటి వివరాలు మాత్రం బయటకు పొక్కలేదు. కొందరు శాంపిల్స్‌ ఇవ్వడానికి నిరాకరించారనుకోండి, అది వేరే విషయం.

‘మాకు ఈ కేసుతో సంబంధం లేదు, మేం విచారణకు సహకరిస్తాం, క్లీన్‌ చిట్‌తో బయటకు వస్తాం’ అని దాదాపు అందరూ నమ్మకం వ్యక్తం చేశారు విచారణ సమయంలో. అన్న మాట ప్రకారమే దాదాపుగా అందరికీ క్లీన్‌ చిట్‌ వచ్చినట్లే కన్పిస్తోంది. మరోపక్క, పై పన్నెండు మందిలో కొందరు డ్రగ్స్‌ విషయంలో బాధితులుగా వున్నట్లు పోలీసులు చార్జి షీట్‌లో పేర్కొన్నారనే వార్తలూ బయటకు పొక్కుతున్నాయి. అయితే, పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కావడంలేదు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!

ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...