ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీఓ ప్రకారం నిర్ణయించిన ధరలకే థియేటర్లలో టికెట్లు అమ్మాల్సి రావడంతో ఎగ్జిబిటర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గ్రామ పంచాయితీ పరిథిలో ఏసీ థియేటర్లు రూ. 20, 15, 10 రూపాయలకు అమ్మడం అనేది అసలు ఏరకంగానూ ఆమోదయోగ్యం కాదని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. ఈ టికెట్లతో కనీసం మైంటెయినెన్స్, విద్యుత్ చార్జీలు కూడా రావని వారు వాపోతున్నారు.
దీంతో థియేటర్లు రన్ చేయడం కంటే మూసి వేయడం బెటరని భావించి ఇప్పటికే పలు చోట్ల థియేటర్లను మూసివేశారు. ఇదే బాటలో మరికొందరు నడవనున్నారు. వకీల్ సాబ్ ప్రస్తుతం ఇంకా థియేటర్లలో రన్ అవుతుండడంతో మరికొన్ని రోజులు వేచి చూస్తారు.
ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలవడానికి సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే వారం టాలీవుడ్ ప్రముఖులు, జగన్ మధ్య భేటీ జరగనుంది. థియేటర్ల టికెట్ రేట్లను మరోసారి సమీక్షించాలని కోరనున్నారు.
402375 948758Very good post. I previousally to spend alot of my time water skiing and watching sports. It was quite possible the very best sequence of my past and your content kind of reminded me of that period of my life. Cheers 973530
845075 162869Enjoyed reading this, very excellent stuff, thankyou . 188493