వాళ్లంతా ఇంటర్మీడియట్ విద్యార్ధులే. ఎవరికీ ఓటు హక్కు లేదు. అందుకేనేమో ఆత్మహత్యలు చేసుకుంటున్నా, పాలకులు కళ్లు తెరవడం లేదు. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విద్యార్ధుల ప్రాణాలు తీసేస్తున్నాయి. ఒకట్రెండు పొరపాట్లు జరిగితే దాన్ని రాద్ధాంతం చేస్తారా.? అని తెలంగాణాలో అధికార పక్షం ప్రశ్నిస్తోంది అమాయకంగా. ఒక చిన్న పొరపాటు ఓ విద్యార్ధి ప్రాణాన్ని తీసేస్తే, దాన్ని చిన్న విషయమని ఎలా అనగలం.? ఒకరు కాదు, ఇద్దరు కాదు, 16 మందికి పైగా ప్రాణాలు పోగొట్టుకున్నారు.
99 మార్కులు రావాల్సిన ఓ విద్యార్ధికి మార్కుల లిస్టులో 00 మార్కులు పడి ఫెయిలైతే అదెంత అవమానకరం.? 425 మార్కులు రావాల్సిన ఓ విద్యార్ధికి 161 మార్కులే వచ్చాయట. 87 మార్కులు రావాల్సి ఉంటే, 27 మార్కులతో సరిపెట్టారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి పొరపాట్లు చాలా జరిగాయి. నిజానికి సమస్య ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు పరీక్షా ఫలితాల విషయంలో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాల్సి ఉంది. విద్యార్ధులకు భరోసా ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి పెదవి విప్పడం లేదు. విద్యాశాఖా మంత్రి జరిగిన పొరపాటు చాలా చిన్నదనీ, దానిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారనీ, విషయాన్ని చాలా చిన్నదిగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్ధుల తల్లితండ్రులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు. లాఠీలు విరగడం ఒక్కటే తక్కువ. అరెస్టుల పర్వంతో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే విద్యార్ధుల భవిష్యత్తుకు సంబంధించి ఇది అత్యవరసర పరిస్థితి.
ఫీజు కట్టండి.. రీ వెరిఫికేషన్ చేసుకోండి.. అంటూ అధికారులు చెబుతున్న సమాధానాలు విద్యార్దులకూ, వారి తల్లితండ్రులకు పుండు మీద కారం చల్లినట్లుంటుంది. ఎవరో తప్పు చేస్తే ఆ తప్పుకి తామెందుకు ఫీజు చెల్లించాలని బాధితులు ప్రశ్నిస్తున్నారు. బాధితులైన విద్యార్ధులు, వారి తల్లితండ్రుల ఆవేదనలోనూ అర్ధముంది. ఆ వెరిఫికేషన్ ఫీజులేవో తప్పు చేసినవాళ్లే చెల్లించాలని రూలింగ్ ఇస్తే, ఇంకోసారి ఇలాంటి తప్పు దొర్లకుండా ఉంటుంది. అంతేకానీ, మీ చావు మీరు చావండి.. అని ఇలాంటి పరిస్థితుల్లో లైట్ తీసుకోవడం అధికారంలో ఉన్నవారిక తగదు.
కొందరు విద్యార్ధులు మాకు ఓటు హక్కు లేదు కనుక మమ్మల్ని పట్టించుకోరా.? అని నిలదీస్తున్నారు. విద్యార్ధుల చావులంటే అంత చులకనైపోయాయా.? అని ప్రశ్నిస్తున్నారు. రెవెన్యూ శాఖలో అవినీతపై ఉక్కుపాదం మోపుతానంటోన్న ముఖ్యమంత్రి విద్యావ్యవస్థ మీద ఎందుకు దృష్టి పెట్టడం లేదనీ ప్రశ్నిస్తున్నారు. విద్యను కొనుక్కోవాలి.. విద్యని అభ్యసించాక ఫలితాలూ కొనుక్కోవాలి.. ఇదేం దుస్థితి అని విద్యార్ధులు వాపోతున్న వైనం అందర్నీ కంట తడి పెట్టిస్తోంది. 99కి 0కి తేడా తెలియని రీతిలో మార్కుల ప్రక్రియ నడుస్తోందంటే నిర్లక్ష్యం ఏ స్థాయిలో రాజ్యమేలుతోందో ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలి.
ఆందోళ చేస్తున్న వారిపై ఉక్కుపాదం మోపడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. సమాధానం చెప్పాల్సిన అధికార యంత్రాంగం చేతులెత్తేస్తే.. అధికారంలో ఉన్న వారు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే, విద్యార్ధులకు దిక్కెవరు.? దేశంలో అన్ని రంగాల్లోనూ తెలంగాణా దూసుకుపోతోందని చెబుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై ఏం సమాధానం చెబుతారు.? బ్రాండ్ తెలంగాణాకి మచ్చ తెచ్చిన ఈ ప్రక్రియపై కేసీఆర్ ఎలా తన ప్రభుత్వాన్ని సమర్ధించుకోగలరు.?
155516 131846An really intriguing examine, I might not agree completely, but you do make some quite legitimate factors. 659045
847741 475811I discovered your weblog website internet site on the internet and appearance some of your early posts. Continue to keep inside the great operate. I just now additional increase your Rss to my MSN News Reader. Seeking toward reading far much more from you finding out at a later date! 412904
211947 768527I want to thank you for the excellent post!! I definitely liked every bit of it. Ive bookmarked your web website so I can take a appear at the latest articles you post later on. 146267
243269 211957I gotta bookmark this internet site it seems extremely valuable very useful 592299
82106 293658Hey there! Wonderful post! Please do tell us when we shall see a follow up! 785868