ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ప్రభావం బాగానే ఉండనుందా? ఆ పార్టీకి జనం నుంచి చక్కని స్పందనే వచ్చిందా? సైలెంట్ గా ఓట్లు పడి ఉంటాయా? ప్రస్తుతం ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ఎన్నికల ఫలితాలు రావడానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై చర్చోపచర్చలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఎవరికి వారు తమకు ఇన్ని సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. విజయంపై అందరూ ధీమాగానే ఉన్నారు. పైకి విజయం తమదే అని స్పష్టంచేస్తున్నప్పటికీ, లోపల మాత్రం వారిని గుబులు వెంటాడుతోంది.
ఏపీలో ప్రధానంగా రెండు పార్టీల మధ్యే పోరు ఉంటే, ఇంత టెన్షన్ ఉండేది కాదు. కానీ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కూడా పోటీకి దిగడంతో ఓ మోస్తరు స్థానాల్లో ముక్కోణపు పోరు జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు గణనీయంగా జనసేన గండి కొట్టింది. వాస్తవానికి జనసేన ప్రభావం పెద్దగా ఉండదని, కేవలం కాపు కమ్యూనిటీలోని యువత ఓట్లు మాత్రమే ఆ పార్టీకి పడే అవకాశం ఉందని తొలుత విశ్లేషణలు వచ్చాయి. దీనికి తగ్గట్టుగానే ఎన్నికల ముందు వచ్చిన సర్వేలు కూడా జనసేనను అంతగా పట్టించుకోలేదు. జాతీయ సర్వేలైతే అస్సలు జనసేన పేరే ప్రస్తావించలేదు. లోకల్ సర్వేలు మాత్రం జనసేన సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని తేల్చాయి. ఇలాంటి పరిస్థితుల నడుమ బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో కలసి జనసేన బరిలోకి దిగింది.
జనసేన పోటీలో ఉండటం వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టమని ఒక వాదన వినిపించగా.. అది వైఎస్సార్ సీపీకే గండి కొడుతుందని మరో వాదన తెరపైకి వచ్చింది. జనసేన పార్టీ అభ్యర్థులు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుస్తారని, ఫలితంగా ఆ ఓట్లు వైఎస్సార్ సీపీకి దక్కవని, అది తమకే లాభమని టీడీపీ నేతలు విశ్లేషించుకున్నారు. అయితే, గత ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి పోటీ చేసినప్పడు చాలా స్థానాల్లో బొటాబొటీ మెజార్టీతోనే టీడీపీ గట్టెక్కిందని.. ఇప్పుడు ఆ రెండు పార్టీల మద్దతు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన అధికార పార్టీకి జనసేన రూపంలో దెబ్బ తప్పదని వైఎస్సార్ సీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. తమ ఓటు బ్యాంకు పదిలంగా ఉందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా జనసేన తమకు లాభం చేకూర్చనుందని చెబుతున్నారు.
ఇలా ఎవరికి వారు విశ్లేషణలు చేసుకుంటున్నప్పటికీ, జనసేన మాత్రం ఇలాంటి లెక్కలు వేసుకోవడంలేదు. తాము అధికారం చేజిక్కించుకునే స్థాయిలో సీట్లు గెలుచుకోలేమని జనసేనకూ తెలుసు. అయితే, హంగ్ ఏర్పడితే తాము కీలకం కావొచ్చన్నది మాత్రమే ఆ పార్టీ ఆశ. అయితే, ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఎన్ని ఓట్లు పడ్డాయనే అంశంపై తాజాగా కొత్త విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. ఒక్క కాపు కమ్యూనిటీకి చెందిన యువతే కాకుండా వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు కూడా జనసేన వైపు మొగ్గు చూపారని అంటున్నారు. పవన్ వల్ల మార్పునకు నాంది పడే అవకాశం ఉందని వారు నమ్మడంతో జనసేనుడి పక్షాన నిలిచారని చెబుతున్నారు. పైగా వారు తమ ఓట్లు వేయడమే కాకుండా కుటుంబ సభ్యులపై కూడా ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం.
మహిళలు, వృద్ధుల ఓట్లు ప్రధాన పార్టీలు పంచుకున్నప్పటికీ, యువత ఓట్లలో అధిక భాగం జనసేనకు పడి ఉండొచ్చని కొత్త అంచనాలు వస్తున్నాయి. మొత్తమ్మీద జనసేనకు సైలెంట్ ఓటింగ్ పడిందని అంటున్నారు. అయితే, ఇది భారీగా సీట్లు గెలుచుకునే స్థాయిలో ఉండకపోయినా, ఓటింగ్ షేర్ మాత్రం బాగానే ఉంటుందని చెబుతున్నారు. జనసేన అధినేత తమకు 15 సీట్లు రావొచ్చని అంచనా వేసుకున్నారు. అంటే, సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందనుకున్న పార్టీ.. బాగానే ప్రభావం చూపించిందని భావించొచ్చు.
473102 485662You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous features and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 541773
648735 178328hi and thanks for the actual weblog post ive lately been looking regarding this specific advice on-line for sum hours these days as a result thanks 921233
74703 466141I adore your writing style truly enjoying this web site . 624827
558951 881315very good post, i surely love this internet site, keep on it 77792
833677 167471I was suggested this internet website by my cousin. Im not positive whether this post is written by him as nobody else know such detailed about my difficulty. Youre incredible! Thanks! 440345