రెడ్డిగారితో బాబుగారికి తలనొప్పి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,476FansLike
57,764FollowersFollow

సీనియర్‌ పొలిటీషియన్‌ జేసీ దివాకర్‌ రెడ్డి, సొంత పార్టీకి తలనొప్పి తీసుకురావడంలో దిట్ట. కాంగ్రెస్‌లో ఉన్నప్పుడూ ఆయనదీ అదే తీరు. టీడీపీలోకి వచ్చాక ఇంకాస్త చాదస్తం పెరిగింది. చంద్రబాబును పొగుడుతూ తిట్టడంలో, జేసీ దివాకర్‌ రెడ్డి చాణక్యం, తెలుగుదేశం పార్టీ నేతలకే మింగుడు పడడంలేదు. ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్ట్‌ పూర్తి కావడం కష్టం.. అని జేసీ దివాకర్‌ రెడ్డి ఎప్పుడో చెప్పారు. అదే జరిగిందిప్పుడు. అలా చంద్రబాబును పలు వేదికలపై ఇరకాటంలో పెడుతూనే, చంద్రబాబును పొగుడుతుంటారు జేసీ దివాకర్‌ రెడ్డి. తాజాగా ఎన్నికల ఫలితాలపై జేసీ దివాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తెలుగు తమ్ముళ్లు షాక్‌కి గురయ్యారు.

నియోజక వర్గానికి 50 కోట్లు ఖర్చయ్యాయని జేసీ మీడియా ముందు చెప్పడంతో ఈ విషయమై చంద్రబాబుకు కొందరు తెలుగు తమ్ముళ్లు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి పక్కలో బళ్లెంలా మారిన జేసీ వ్యవహార శైలిపై చంద్రబాబు కూడా ఆందోళనగానే ఉన్నారట. కానీ జేసీ దివాకర్‌ రెడ్డితో చంద్రబాబుకు చాలా అవసరాలున్నాయి. అందుకే ఆయన్ని ఏమీ అనలేకపోతున్నారు. నియోజక వర్గానికి 50 కోట్ల వ్యవహారంపై కూడా చంద్రబాబు, జేసీని ప్రశ్నించారట. దానికి జేసీ దివాకర్‌ రెడ్డి నుండి నిర్లక్ష్యంతో కూడిన సమాధానం వచ్చిందట. తాను నిజమే మాట్లాడానని జేసీ చెబితే, ఆ నిజాలు మన పార్టీకి చేటు చేయకూడదనీ, చంద్రబాబుకు జేసీకి సూచించినట్లు తెలుస్తోంది. అయితే, గుమ్మడి కాయల దొంగా.. అనకుండానే భుజాలు తడుముకోవడమేంటని చంద్రబాబుపై జేసీ అసహనం వ్యక్తం చేశారట.

అయినా ‘నేను టీడీపీ గెలుస్తుందనే కదా చెప్పాను.. చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని అన్నాను కదా.. ప్రతిపక్షాన్ని విమర్శించాను కదా.. అయినా ఎందుకు సొంత పార్టీ నేతలు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు..’ అని జేసీ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. ఇదిలా ఉంటే, జేసీ అంతర్గత సర్వేల్లో తెలుగు దేశం పార్టీ గట్టెక్కడం కష్టమేనని తేలిందనీ, ఆ విషయాన్నే ఆయనే లీక్‌ చేశారనీ, టీడీపీ నేతలు కొందరు మీడియాకి ఉప్పందిస్తున్నారు, అధినేతకు సమాచారమిస్తున్నారు. జేసీ మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో ఈ మధ్య చాలా మంది నేతలు ఇలాగే చంద్రబాబుకు తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఓ సీనియర్‌ నేత ఫలితాలెలా ఉంటాయనే దానిపై విశ్లేషించి, ఊహించి టీడీపీ పరిస్థితి కష్టమే అని తేల్చడమే కాదు, వైసీపీతో టచ్‌లోకి కూడా వెళ్లారట. ఉత్తరాంధ్రకు చెందిన ఓ ముఖ్య నేత టీడీపీ నుండి జనసేనలోకి వెళ్లేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారట. ఇలాంటోళ్లు టీడీపీలో చాలా మందే ఉన్నారనీ మే తర్వాత రాజకీయాలు అనూహ్యంగా మారతాయనీ, జంపింగ్‌ జపాంగ్‌ల్లో జేసీ లాంటి నేతలు చాలా మందే ఉంటారనీ ప్రతిపక్షం వైసీపీ అంచనా వేస్తోంది. ఏది ఏమైనా రాజకీయాలు చాలా హాట్‌గా, చాలా కాస్ట్‌లీగానూ మారిపోయాయి.

ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బులు కావాలి. గెలవడానికి డబ్బులు కావాలి. గెలిచాక అధికారం నిలబెట్టుకోవడానికీ డబ్బులు కావాలి. ఎన్నికలకే పదివేల కోట్లు ఖర్చయితే, దాన్ని రాబట్టుకోవడానికి రాజకీయ నాయకులు పిల్లి మొగ్గలేయకుండా ఉంటారా.? జేసీ ఆవేదనలో అంత అర్ధముంది. రాజకీయాలు మారాలి. డబ్బు ప్రమేయం లేని రాజకీయం రావాలి. కానీ పిల్లి మెళ్లో గంట కట్టేదెవరు.?

8 COMMENTS

సినిమా

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

వివాదంగా మారిన థియేటర్ల “రెంటల్ – పర్సంటేజ్” అంటే ...

తెలంగాణలో నిర్మాతలు – థియేటర్ యజమానుల మధ్య జరుగుతున్న గొడవ ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. ఇది నిజంగా సినిమా పరిశ్రమ సమస్యలకు పరిష్కారమా? లేక అసలు...

Jr.Ntr: రూ.100కోట్ల విరాళాల సేకరణకు ప్లాన్..! స్పందించిన జూ.ఎన్టీఆర్ టీమ్

Jr.Ntr: మే 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానుల సందడి తెలిసిందే. అన్ని ప్రాంతాల్లో తమతమ పరిధిలో ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తారు....

Urvashi Rautela: కేన్స్ లో మెరిసిన ఊర్వశి రౌతేలా..! ఆమె లుక్...

Urvasi Rautela: బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వాల్తేరు వీరయ్య, డాకూ మహారాజ్, బ్లాక్ రోజ్, స్కంద సినిమాల్లో స్పెషల్ సాంగ్స్...

రాజకీయం

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

“కేడర్ లేకపోతే మనం లేము.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలి”: నారా లోకేష్

అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

ఎక్కువ చదివినవి

పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా,...

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలకు విజయ్ రిప్లై.. హృదయపూర్వక కృతజ్ఞతలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీవీకే అధినేత విజయ్‌కు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. విజయ్‌తో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అందరికీ అభినందనలు...

“హలో ఇండియా!” పేరుతో చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు..

ఆంధ్రప్రదేశ్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddy తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu...

యువ ప్రేక్షకుల బంగారు కొండ.. ఈ విజయ్ దేవరకొండ

Vijay Devarakonda: సాధారణ యువకుడు.. సినీరంగంలో రాణించాలని వచ్చాడు. తన ఫోటోలతో స్టూడియోలకు వెళ్ళాడు. ఆఫీసుల చుట్టూ తిరిగాడు. ఫోటోలు ఇచ్చాడు. మొత్తంగా వెండితెరపై కనిపించాడు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్లు వేశాడు. నిర్మాత–దర్శకులను...