తెలంగాణ లో దాదాపు మూడు నెలల తర్వాత ప్రారంభమైన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. గతనెల 21న వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు మొదలైన తర్వాత తొమ్మిది రోజుల్లో రూ.383 కోట్ల ఆదాయం సమకూరడమే ఇందుకు నిదర్శనం.
రాష్ట్రవ్యాప్తంగా 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గతనెల 21 నుంచి 31 వరకు 9 పనిదినాల్లో భారీగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఎల్ ఆర్ఎస్ నిబంధనల్లో సడలింపులు ఇచ్చిన తర్వాత రెండు రోజుల్లోనే 20వేలకు పైగా లావాదేవీలు జరగ్గా.. రూ.170 కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టు సమాచారం. గతేడాది మార్చి తర్వాత ఇంతపెద్ద మొత్తంలో ఆదాయం రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే, కరోనా కల్లోలంతో అవన్నీ తలకిందులయ్యాయి. అనంతరం మూడునెలల పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిపివేయడం మరింత శరాఘాతంగా మారింది.
ఈ నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు కేవలం రూ.1864 కోట్లు మాత్రమే రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం వచ్చింది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు ఊపందుకున్నందున ఇకపై నెలకు రూ.1000 కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
15500 927913Previously you should have highly effective internet business strategies get you started of getting into topics suitable for their web-based organization. educational 2411
892179 642989Nice site, good and straightforward on the eyes and excellent content too. Do you need to have many drafts to make a post? 897872